Read more!

కోటిదీపోత్సవం.. విద్యార్ధుల వేదపఠనం, మహశివ లింగానికి అభిషేకం

 

 

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో నవంబర్ 3 వ తేదీ నుంచి భక్తి కోటిదీపోత్సవం ప్రారంభమైన సంగతి తెలిసిందే. నవంబర్ 18వ తేదీ వరకూ కోటిదీపోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమం ప్రతి రోజూ సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రారంభమవుతుంది. ఎంతో ఘనంగా జరుగుతోన్న కోటిదీపోత్సవం ఆదివారం సాయంత్రం శ్రీ వ్రతధరజీయర్ వేద గురుకులం విద్యార్ధుల వేదపఠనంతో ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రాంగణంలోని మహశివ లింగానికి ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు. అన్నమయ్య సంకీర్తనార్చన, తిరుమల శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు. పల్లకీలపై తిరుమల ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో విశాఖ శారదా పీఠం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి పాల్గొన్నారు. అదేవిధంగా అతిధులుగా టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, బీజేపీ రాజ్యసభ సభ్యులు సియం.రమేష్, సుజనా చౌదరి పాల్గొన్నారు.