TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

political-news-img

తెలంగాణలో ఆటో ప్రయాణం ఇక ప్రియం.!

తెలంగాణలో రోజువారీ ప్రయాణం చేసే సామాన్యలు ఆటోల్లో ప్రయాణించాలంటే ఇక ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే. పెరిగిన ఇంధన ధరలు, విడిభాగాల ఖర్చులు, వాహనాల బీమా ప్రీమియంలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఆటో కార్మిక సంఘాలు గతంలో తలపెట్టిన సమ్మె విరమణ సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రవాణా శాఖ అధికారులు కేరళ, దిల్లీ, కర్ణాటక, మహారాష్ట్రల్లోని ఆటో టారిఫ్ విధానాలను అధ్యయనం చేసి నివేదికను రూపొందించారు. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం, ఆటో ప్రయాణానికి సంబంధించిన కనీస ధర భారీగా పెరుగుతుంది. ఇప్పటివరకు మొదటి రెండు కిలోమీటర్లకు అమలులో ఉన్న పద్ధతిని మార్చి, కొత్త నిబంధనల కింద మొదటి 1.6 కిలోమీటర్ల దూరం వరకు కనీస ఛార్జీని 30 రూపాయలకు పెరిగే అవకావం ఉంది. అలాగే.. ఆ తర్వాత ప్రతి అదనపు కిలోమీటరుకు 11 నుంచి 14 రూపాయలకు పెరుగుతుంది. ఆటో రంగంలోని వాస్తవ ఖర్చులను బేరీజు వేసి ఈ పెంపును ఖరారు చేశారు. కేవలం సాధారణ కిలోమీటర్ల చార్జీలే కాకుండా, ట్రాఫిక్ జామ్‌లలో ఆటో నిలిచిపోయినప్పుడు వర్తించే డిటెన్షన్ లేదా వెయిటింగ్ ఛార్జీలను కూడా కొత్త నిబంధనల్లో పొందుపరిచారు. దీని ప్రకారం ట్రాఫిక్‌లో ఆటో ఆగిన ప్రతి నిమిషానికి 75 పైసల వెయిటింగ్ ఛార్జీని ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రాత్రి వేళల్లో ప్రయాణించే వారికి మరో భారం తప్పదు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు జరిగే ప్రయాణాలకు సాధారణ మీటర్ ఛార్జీపై అదనంగా 50 శాతం సర్ఛార్జ్ వసూలు చేయాలని కమిటీ ప్రతిపాదించింది. వీటితో పాటు ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లే లగేజీ విషయానికి వస్తే, ఒక సాధారణ బ్రీఫ్‌కేస్ లేదా హ్యాండ్‌బ్యాగ్ మినహా ఇతర పెద్ద ప్యాకేజీలకు ప్రతి దానికి 50 పైసల చొప్పున అదనపు రుసుము చెల్లించాలని, గరిష్టంగా 100 కిలోల వరకు లగేజీని అనుమతించవచ్చని పేర్కొన్నారు. [Auto Fare Hike Telangana, minimum auto fare RS30, Transport Committee Recomand, Hyderabad Auto Charges, Auto Meter Tariff, Telugu One]

Published on: Sat Sep 5, 2026 12:37PM

political-news-img

ప్రియురాలి పుట్టినరోజుకు ఐఫోన్ గిఫ్ట్‌.. చివరకు జైలుకు..!

ఐఫోన్‌ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..! ప్రియురాలి పుట్టినరోజును స్పెషల్‌గా చేయాలనుకున్నాడు. ఆమెకు ఖరీదైన ఐఫోన్‌ గిఫ్ట్‌గా ఇస్తానని మాటిచ్చాడు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు డబ్బు సంపాదించాలనుకున్నాడు. కానీ.. అందుకోసం ఎంచుకున్న అక్రమ మార్గం చివరకు అతడిని కటకటాల వెనక్కి నెట్టింది. ప్రియురాలికి గిఫ్ట్‌ కొనివ్వాలన్న ఆలోచనతో గంజాయి అక్రమ రవాణాకు తెరలేపాడు. అంతేకాదు.. ఈ వ్యవహారంలోకి ప్రియురాలిని కూడా లాగాడు. ఒడిశా నుంచి గంజాయి తీసుకుని తెలంగాణకు తిరిగి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. తప్పించుకునే క్రమంలో పోలీసులపైకే బైక్‌ను దూసుకెళ్లించే ప్రయత్నం చేయడంతో ఎస్సై గాయపడ్డారు. చివరకు ప్రేమికులిద్దరూ పోలీసులకు చిక్కారు. విచారణలో అసలు విషయం బయటపడింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన చైతన్య (21), హేమలత (20) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. త్వరలో హేమలత పుట్టినరోజు ఉండటంతో.. ఆమెకు కొత్త ఐఫోన్‌ బహుమతిగా ఇస్తానని చైతన్య మాటిచ్చాడు. అయితే అతడి వద్ద గిఫ్ట్‌ కొనుగోలు చేసేందుకు అవసరమైన డబ్బు లేకపోవడంతో.. ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆలోచనలో పడ్డాడు. చివరకు గంజాయి రవాణా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాలకు చెందిన శశి, నాగూర్‌లను సంప్రదించాడు. ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి ఇస్తానని వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గంజాయి తీసుకురావడానికి ఒంటరిగా వెళ్లకుండా ప్రియురాలు హేమలతను కూడా వెంటబెట్టుకున్నాడు. ఇద్దరూ పల్సర్‌ బైక్‌పై ఒడిశాకు బయలుదేరారు...ఒడిశాలోని పసుపులంక ప్రాంతంలో ఐదు రోజులపాటు మకాం వేసిన ఇద్దరూ.. స్థానికుడైన భగవాన్‌ నుంచి 12 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. దాన్ని బైక్‌పై పెట్టుకుని తెలంగాణకు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే వైరా సమీపంలోకి రాగానే పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. చైతన్య బైక్‌ను ఆపకుండా తప్పించుకునేందుకు పోలీసులపైకే దూసుకెళ్లించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనలో వైరా ఎస్సై స్వల్పంగా గాయపడ్డారు. అయినప్పటికీ పోలీసులు వెనక్కి తగ్గకుండా బైక్‌ను అడ్డుకుని చైతన్య, హేమలతను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ.6 లక్షల విలువైన 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చైతన్య ఇప్పటికే మూడు గంజాయి కేసుల్లో అరెస్టయినట్లు పోలీసులు తెలిపారు. అయినప్పటికీ అతడి నేర ప్రవృత్తిలో మార్పు రాలేదు. ఈసారి ప్రియురాలికి ఐఫోన్‌ గిఫ్ట్‌ ఇవ్వాలన్న కోరికతో మరోసారి అదే నేర మార్గాన్ని ఎంచుకున్నాడు. తనతో పాటు ప్రేమించిన హేమలతను కూడా ఈ వ్యవహారంలోకి లాగాడు. మత్తు పదార్థాల కేసుల్లో గతంలో పట్టుబడిన వ్యక్తుల కదలికలను ఈగల్‌ బృందాలు నిరంతరం ట్రాక్‌ చేస్తున్నాయని ఈగల్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య తెలిపారు. ఈ క్రమంలోనే చైతన్య కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిపై నిఘా పెట్టి పట్టుకున్నట్లు వెల్లడించారు. ఒకరి పుట్టినరోజును ప్రత్యేకంగా చేయాలన్న కోరిక.. ఓ యువకుడిని చట్టవ్యతిరేక మార్గంలోకి నెట్టింది. ప్రేమించిన వ్యక్తికి ఖరీదైన బహుమతి ఇవ్వాలన్న ఆలోచన తప్పు కాకపోయినా.. అందుకోసం ఎంచుకున్న మార్గం మాత్రం ఇద్దరి జీవితాలను ప్రమాదంలోకి నెట్టింది. ఐఫోన్‌ గిఫ్ట్‌ ఇవ్వాలనుకున్న ప్రేమ.. చివరకు ఇద్దరి చేతులకు సంకెళ్లు వేసింది. గిఫ్ట్‌ కొనాల్సిన డబ్బు కోసం మొదలైన ప్రయాణం.. చివరకు జైలు గడప వద్ద ముగిసింది. (iPhone Gift, Girlfriend Birthday, Love Couple, Ganja Smuggling, Marijuana Smuggling, Telangana Crime, Telangana Police, Peddapalli, Odisha Ganja, Drug Smuggling, Couple Arrest, Chaitanya, Hemalatha, Telangana News, Viral Crime News, Telugu one)

Published on: Fri Sep 4, 2026 2:43PM

political-news-img

ఉల్లి, వెల్లుల్లి ధరలు పైపైకి.!

ధరల మంట సామాన్యుడి వంట గదిలో చిచ్చు పెడుతోంది. సామాన్యుడి రోజు వారీ ఆహారంలో అత్యంత కీలక పాత్ర పోషించే ఉల్లి, వెల్లుల్లి, అల్లం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రోజుల వ్యవధిలోనే వీటి ధరలు విపరీతంగా పెరగడం పట్ల సామాన్యులలో ఆందోళన వ్యక్తమౌతోంది. నెల రోజుల కిందటి వరకూ క్వింటాల్ రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది. అదే విధంగా అల్లం, వెల్లుల్లి ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. క అల్లం క్వింటాల్ రూ. 16 వేలకు వెల్లుల్లి క్వింటాల్ రూ. 19 వేలకు పెరిగింది. దీంతో రిటైల్ మార్కెట్‌లో కిలో వెల్లుల్లి ధర 250 రూపాయలు దాటిపోయింది. వాతావరణ మార్పులు, యు వర్షాభావ పరిస్థితుల కారణంగా దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడమే ఈ ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గత జూన్, జులై నెలల్లో మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలు ఉల్లి దెబ్బతీశాయి. మరోవైపు, కర్ణాటకతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉల్లి సాగు విస్తీర్ణం బాగా తగ్గింది. సాధారణంగా రోజుకు 20 వేల క్వింటాళ్ల సరుకు రావాల్సిన మలక్‌పేట మార్కెట్‌కు, ప్రస్తుతం 5 వేల క్వింటాళ్లు మాత్రమే దిగుమతి అవుతోంది. దీంతో డిమాండ్ కు సప్లైకు అంతరం బాగా పెరిగి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ధరల పెరుగుదల ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. [Onion prices High, ginger and garlic rates, Malakpet market, kitchen budget, rise in vegetable prices, Telugu One]

Published on: Fri Sep 4, 2026 9:46AM

political-news-img

గవర్నర్‌తో సీఎం రేవంత్ భేటీ.. అధికారికంగా కొండా సురేఖ బర్తరఫ్..!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించారు. ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్‌భవన్ అధికారికంగా ప్రకటించింది. కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విడుదల చేసిన ప్రెస్ కమ్యూనికేలో వెల్లడించారు. ఈ తొలగింపు తక్షణమే అమల్లోకి వస్తుందని అధికారిక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ మేరకు 2026 సెప్టెంబర్ 3న హైదరాబాద్‌లోని లోక్‌భవన్ నుంచి రాజ్‌భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యమంత్రి సలహా మేరకే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు.దీంతో కొండా సురేఖ ఇకపై తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో కొనసాగరు. అయితే ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించడానికి దారితీసిన కారణాలను మాత్రం అధికారిక ప్రకటనలో వెల్లడించలేదు.కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్లు వెలువడిన ప్రకటనతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ పరిణామం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి లోక్‌భవన్‌కు చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ కూడా వెళ్లారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో సీఎం, మంత్రులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ముఖ్యంగా కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగించే అంశంపై గవర్నర్‌తో సీఎం చర్చించినట్లు సమాచారం. ఆమె బర్తరఫ్‌కు దారితీసిన పరిస్థితులను రేవంత్ రెడ్డి గవర్నర్‌కు వివరించారు. అనంతరం బర్తరఫ్‌కు గవర్నర్ ఆమోదం తెలిపారు. సీఎం ఎదురుగానే గవర్నర్ బర్తరఫ్ ఉత్తర్వులపై సంతకం చేసినట్లు తెలిసింది. (CM Revanth Reddy, Konda Surekha, Telangana Politics, Telangana Cabinet, Konda Surekha Dismissal, Telangana Governor, Shiv Pratap Shukla, Lok Bhavan, Revanth Reddy Meeting, Telangana Government, Telugu one, Telugu news)

Published on: Thu Sep 3, 2026 9:23PM

political-news-img

సైదాబాద్ స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..! హైదరాబాద్ నగరం మరో అద్భుతమైన మౌలిక వసతుల మైలురాయిని సొంతం చేసుకుంది. నిత్యం తీవ్రమైన ట్రాఫిక్ పద్మవ్యూహంతో విసిగిపోతున్న భాగ్యనగర వాసులకు, ముఖ్యంగా పాతబస్తీ ప్రాంత ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ నల్గొండ ఎక్స్ రోడ్స్ - సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. గురువారం రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక ఫ్లైఓవర్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, నగర రవాణా వ్యవస్థలో ఈ వంతెన ఒక విప్లవాత్మక మార్పును తెస్తుందని స్పష్టం చేశారు. మలక్‌పేట్ ఫైర్ స్టేషన్, చాంచల్‌గూడ నుంచి సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట వైపు వెళ్లే ప్రయాణికులకు ఈ ప్రాజెక్ట్ ఎంతో మేలు చేస్తుందని, గత కొన్నేళ్లుగా పాతబస్తీ వాసులు ఎదుర్కొంటున్న తీవ్రమైన వాహన రాకపోకల సమస్యలకు ఈ బ్రిడ్జితో శాశ్వత పరిష్కారం లభించిందని సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ స్టీల్ ఫ్లైఓవర్ కీలక గణాంకాలను పరిశీలిస్తే దీని ప్రాధాన్యత ఎంతటిదో స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు రూ. 620 కోట్ల భారీ వ్యయంతో ఈ బ్రిడ్జిని అత్యంత ఆధునిక ఇంజనీరింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. మొత్తం 3.32 కిలోమీటర్ల పొడవుతో రూపుదిద్దుకున్న ఈ నాలుగు లేన్ల వంతెనలో 2.63 కిలోమీటర్ల మేర ప్రధాన వయాడక్ట్ నిర్మాణం ఉండగా, ఐఎస్ సదన్ జంక్షన్ వద్ద 200 మీటర్ల అప్-ర్యాంప్ ఏర్పాటు చేశారు. మొత్తం 88 స్పాన్లతో అత్యంత బలమైన ఉక్కు నిర్మాణంతో సిద్ధమైన ఈ వంతెన గ్రేటర్ హైదరాబాద్‌లోనే అతి పొడవైన స్టీల్ ఫ్లైఓవర్‌గా సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో నల్గొండ ఎక్స్ రోడ్స్ నుంచి ఒవైసీ ఆస్పత్రి జంక్షన్ వరకు లేదా సంతోష్ నగర్ యాదగిరి థియేటర్ వరకు ప్రయాణించాలంటే వాహనదారులకు కనీసం 35 నుంచి 40 నిమిషాల సమయం పట్టేది. అయితే ఇప్పుడు ఈ ఆధునిక వంతెన అందుబాటులోకి రావడంతో ఆ ప్రయాణ సమయం కేవలం 5 నిమిషాలకు తగ్గిపోయింది. దీనివల్ల ప్రతీరోజూ ఈ మార్గంలో రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులకు ఏకంగా 30 నిమిషాల ప్రయాణ సమయం ఆదా కానుంది. ఈ వంతెన నిర్మాణ ప్రయాణంలో ఎదురైన రాజకీయ సవాళ్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (SRDP) కింద 2020లో ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన జరిగినప్పటికీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కొబ్బరికాయ కొట్టి వదిలేసిందని, స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు సరిగ్గా కేటాయించలేదని ఆయన విమర్శించారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించి, బడ్జెట్ విడుదల చేసి నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశామని చెప్పారు. ఇన్నేళ్లలో ఎంతమంది ముఖ్యమంత్రులు పాతబస్తీ సందుల్లోకి వచ్చారని ఆయన ప్రశ్నించారు. గతంలో ఏ సీఎం రాని విధంగా తాను నేరుగా పాతబస్తీ గల్లీల్లోకి వచ్చి ప్రజల క్షేత్రాన్ని పరిశీలిస్తున్నానని పేర్కొన్నారు. పాతబస్తీ సమగ్ర అభివృద్ధే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. పాతబస్తీ అభివృద్ధి కోసం స్థానిక ప్రజాప్రతినిధులైన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీలతో సమగ్రంగా చర్చలు జరిపినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. పాతబస్తీ పరిధిలో మౌలిక వసతుల విస్తరణకు, ప్రజా సంక్షేమానికి అసద్ భాయ్ ప్రతిపాదించే ప్రతీ అభివృద్ధి ప్రతిపాదనను వెంటనే పరిశీలించి నిధులు మంజూరు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను సీఎం రేవంత్ రెడ్డి వేదికపైనే ఆదేశించారు. పాతబస్తీలోని ప్రతీ సోదరి, ప్రతీ ఇంట్లోని ఆడబిడ్డలు ఉన్నత చదువులు చదువుకుని ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లుగా సమాజంలో ఉన్నత స్థానాల్లో నిలవాలన్నదే తన బలమైన ఆకాంక్ష అని రేవంత్ రెడ్డి భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. ఈ ప్రాంత యువతకు సరైన విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారానే పాతబస్తీ రూపురేఖలు మారతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తుంటే, ప్రతిపక్షాలు మాత్రం ప్రతీ అభివృద్ధి కార్యక్రమాన్ని రాజకీయ కోణంలోనే చూస్తూ అడ్డుకునే యత్నం చేస్తున్నాయని సీఎం మండిపడ్డారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో గంగా, యమునా నదుల రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులకు మద్దతు తెలిపే ప్రతిపక్ష నాయకులు, హైదరాబాద్‌లోని మూసీ నది ప్రక్షాళనకు తాము చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్‌ను మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రజలే ఆలోచించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరంలో వాహన కాలుష్యం ఇంధన వృధాను గణనీయంగా తగ్గించేందుకు ఇటువంటి స్టీల్ ఫ్లైఓవర్లు, సీఎస్ఆర్ ప్రాజెక్టులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. నగర ప్రజల క్షేమం మరియు ప్రగతే పరమావధిగా తమ పాలన సాగుతుందని, ఎన్ని రాజకీయ విమర్శలు ఎదురైనా హైదరాబాద్ అభివృద్ధి ప్రయాణం ఆగదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. (Saidabad Steel Flyover Inauguration, Nalgonda X Road Steel Bridge, CM Revanth Reddy, Old City Visit, Hyderabad Signal Free Corridor, GHMC, SRDP Steel Flyover, Nalgonda X Road, Owaisi Hospital Traffic, Telugu one, Telugu news)

Published on: Thu Sep 3, 2026 9:04PM

political-news-img

తెలంగాణలో బర్తరఫ్ అయిన ముగ్గురు మంత్రులు.. ఎవరంటే..?

తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణంలో పాలనాపరమైన, క్రమశిక్షణాత్మకమైన నిర్ణయాలు ఎన్నో సంచలనాలకు కేంద్రబిందువుగా నిలిచాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వివిధ ప్రభుత్వాల హయాంలో మంత్రివర్గం నుంచి ముగ్గురు ప్రముఖ నాయకులు బర్తరఫ్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం. అధికారం చేపట్టిన మొదటి రోజుల్లోనే అవినీతి, శాఖాపరమైన అవకతవకలు లేదా వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ముఖ్యమంత్రులు తమ కేబినెట్ సహచరులపై వేటు వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా బర్తరఫ్ అయిన మంత్రిగా డాక్టర్ తాటికొండ రాజయ్య నిలిచారు. 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా రాజయ్య బాధ్యతలు నిర్వహించారు. అయితే 108 అంబులెన్స్ కొనుగోళ్ళు, పారామెడికల్ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయన్న తీవ్ర ఆరోపణలతో పాటు పర్యవేక్షణా లోపాల నేపథ్యంలో 2015 జనవరి 25న అంటే ప్రభుత్వం ఏర్పడిన కేవలం 8 నెలల వ్యవధిలోనే కేసీఆర్ ఆయనను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. ఆ తర్వాత రెండవ విడత బీఆర్ఎస్ పాలనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2019 నుండి హుజూరాబాద్ శాసనసభ్యుడిగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌పై అసైన్డ్ భూముల ఆక్రమణ ఆరోపణలు వెల్లువెత్తాయి. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో దాదాపు 100 ఎకరాల అసైన్డ్ భూములను ఆక్రమించి పౌల్ట్రీ ఫారమ్ విస్తరించారనే ఫిర్యాదులపై కలెక్టర్, విజిలెన్స్ విచారణకు ఆదేశించిన కేసీఆర్, 2021 మే 1న ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుండి తొలగించారు. ఈ రెండు ఘటనలు బీఆర్ఎస్ పాలనలో తీవ్ర దుమారాన్ని రేపాయి. అలాగే వైద్య ఆరోగ్యశాఖను నిర్వహించిన ఇద్దరు మంత్రులే వరసగా బర్తరఫ్ కావడం విశేషం. ఇక 2023 చివర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఇటువంటి విప్లవాత్మక నిర్ణయం పునరావృతమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ కేబినెట్‌లో దేవాదాయ, అటవీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, రాజకీయంగా రేపిన వివాదాలు సంచలనం సృష్టించాయి. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే రీతిలో బహిరంగ ప్రకటనలు చేయడంపై తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ అధిష్ఠానం మరియు సీఎం రేవంత్ రెడ్డి, ఆమెను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేసి లోక్‌భవన్‌కు పంపారు. దీంతో తెలంగాణ చరిత్రలోనే బర్తరఫ్ అయిన తొలి మహిళా మంత్రిగా కొండా సురేఖ రికార్డుల్లోకి ఎక్కనున్నారు. 2014 నుండి 2026 వరకు గడిచిన పన్నెండేళ్ల కాలంలో ముగ్గురు మంత్రులు అత్యంత అవమానకర రీతిలో వేటుకు గురవడం తెలంగాణ రాజకీయ సమరంలో ఒక మైలురాయిగా నిలిచింది. (Telangana minister dismissed, Kcr cabinet sackings, CM Revanth reddy cabinet update, Tatikonda Rajaiah dismissal, Eatala Rajender removal, Konda surekha news)

Published on: Thu Sep 3, 2026 7:55PM

political-news-img

రైతుల కోసం పాదయాత్ర ప్రకటించిన కేటీఆర్..!

మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్‌ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..! నాగార్జున సాగర్‌ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాదయాత్రకు పిలుపునిచ్చారు. మిర్యాలగూడలో నిర్వహించిన రైతు ధర్నా వేదికగా ఆయన ఈ ప్రకటన చేశారు. నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ ద్వారా రైతులకు నీటిని విడుదల చేయకపోతే.. వేలాది మంది రైతులతో కలిసి కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేపడతానని కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2003లో రైతుల సమస్యల పరిష్కారం కోసం అప్పటి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. నీటి కోసం అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రైతుల సమస్యల పరిష్కారానికి పోరాడారని చెప్పారు.అదే స్ఫూర్తితో కాంగ్రెస్‌ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తాను కూడా పాదయాత్ర చేపడతానని కేటీఆర్‌ స్పష్టం చేశారు. నాగార్జున సాగర్‌లో 180 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ.. ఎడమ కాలువ ద్వారా రైతులకు నీటిని విడుదల చేయకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. సెప్టెంబర్‌ 14లోపు నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ ద్వారా నీటి విడుదలకు సంబంధించిన స్పష్టమైన షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. లేదంటే వేలాది మంది రైతులతో కలిసి కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేపట్టి.. ప్రభుత్వం నీటిని విడుదల చేసేలా పోరాటం చేస్తామని హెచ్చరించారు. (KTR, KTR Padayatra, KTR Farmers Protest, Nagarjuna Sagar, Nagarjuna Sagar Left Canal, Farmers Issues, Telangana Farmers, KTR Warning, BRS, KCR, Kodad, Halia, Miryalaguda, Irrigation Water, Telangana News, Telugu One, Telugu News)

Published on: Thu Sep 3, 2026 7:23PM

political-news-img

టౌన్ ప్లానింగ్ అధికారి ఇంటిపై ఏసీబీ సోదాలు.. రూ.3.54 కోట్ల ఆస్తులు గుర్తింపు..!

ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి, కోదాడ మున్సిపాలిటీ ఇన్‌చార్జి టౌన్‌ ప్లానింగ్‌ అధికారిగా పనిచేస్తున్న వయ్యాల సోమయ్యపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. అక్రమ, అనుమానాస్పద మార్గాల్లో ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు మంగళవారం సోమయ్య కార్యాలయంతోపాటు ఆయన బంధువులు, సహచరులు, ఇతరులకు సంబంధించిన మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వ హించారు. సోదాల్లో భారీగా స్థిర, చరాస్తులతోపాటు నగదు, బంగారం, వెండి, బ్యాంకు నిల్వలు, వాహనాలు, గృహోపకర ణాలు, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లు, విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. సూర్యాపేట జిల్లాలో సోమయ్యకు 3 ఎకరాల 3 గుంటల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. దీని అధికారిక విలువ రూ.2.94 లక్షలుగా అధికారులు అంచనా వేశారు. సూర్యా పేట జిల్లా, హైదరాబాద్‌లో ఐదు నివాస ఆస్తులను గుర్తించారు. వీటిలో జీ+1, జీ+2, జీ+4తోపాటు పెంట్‌హౌస్‌ భవనాలు, మరో రెండు గ్రౌండ్‌ఫ్లోర్‌ ఇళ్లు ఉన్నట్లు ఏసీబీ వెల్లడించింది. వీటి అధికారిక విలువ 2.75 కోట్లుగా ఉంది. అలాగే సూర్యాపేట పరిధిలోని పలు ప్రాంతాల్లో ఎనిమిది ఓపెన్‌ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించగా.. వాటి అధికారిక విలువ 25.85 లక్షలుగా అధికారులు పేర్కొన్నారు. సోదాల్లో రూ.4,63,990 నగదును స్వాధీనం చేసుకున్నారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.13 లక్షల మేర నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. 709 గ్రాముల బంగారు ఆభర ణాలు, 1,750 గ్రాముల వెండి ఆభరణాలు లభించగా.. వీటి విలువ సుమారు రూ.20 లక్షలుగా అంచనా వేశారు. రెండు నాలుగు చక్రాల వాహనాలు, మూడు ద్విచక్ర వాహనాలు ఉన్నట్లు గుర్తించగా.. వాటి విలువ సుమారు రూ.25 లక్షలుగా ఉంది. ఇంట్లోని గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్ల విలువ మరో రూ.11 లక్షలుగా ఏసీబీ అధికా రులు అంచనా వేశారు. ఇదిలా ఉండగా.. బ్యాంకు లో 66 తులాల బంగా రాన్ని తాకట్టు పెట్టి రూ.49 లక్షల గోల్డ్‌ లోన్‌ తీసుకున్నట్లు కూడా ఏసీబీ విచారణలో వెల్లడైంది. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తులన్నింటి అధికారిక విలువను కలిపితేరూ.3,54,36,490గా ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అయితే స్థిరాస్తుల మార్కెట్‌ విలువ అధికారిక విలువ కంటే గణనీయంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇంకా ఏమైనా ఆస్తులు ఉన్నాయా? వాటిని ఏ మార్గంలో సమకూర్చుకు న్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంలో అవినీతి నిరోధక చట్టం- 1988లోని సెక్షన్‌ 13(1)(b), 13(2) కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. నిందితుడు సోమయ్యను హైదరాబాద్‌లోని అవినీతి నిరోధక కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ఫిర్యాదు దా రుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ స్పష్టం చేసింది. (ACB raids, Suryapet district, Planning officer, Yayala Somaiah, CM Revanth reddy, Telangana government, Telugu News, Telugu One)

Published on: Thu Sep 3, 2026 6:34PM

political-news-img

ఎమ్మెల్యేలు, మంత్రులు సంతోషంగా లేరు.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు..!

కాంగ్రెస్‌ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..! తెలంగాణ రాష్ట్ర రాజకీయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిణామాలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ తన వైఖరిని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని, శాసనసభ్యురాలిగా పార్టీలోనే కొనసాగుతానని ఆమె మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇటీవల మంత్రివర్గంలో జరిగిన మార్పుల నేపథ్యంలో తనను పదవి నుంచి తప్పించడంపై ఆమె బహిరంగంగానే మాట్లాడారు. మంత్రి పదవి కోల్పోవడం వల్ల తనకు ఎటువంటి బాధ లేదని, కానీ ఎలాంటి ముందస్తు సమాచారం లేదా స్పష్టమైన కారణం చెప్పకుండా నిర్ణయం తీసుకోవడం ఆవేదన కలిగించిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రస్తుత తీరుపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని కొండా సురేఖ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి ప్రభుత్వం వెంటనే పారదర్శకమైన సర్వేలు చేయించాలని ఆమె సూచించారు. ప్రస్తుత పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో సంతోషంగా లేరని ఆమె ఆరోపించారు. ప్రభుత్వంలోను, పార్టీలోనూ ఎదురవుతున్న ఇబ్బందులపై మిగతా ప్రజాప్రతినిధులు కూడా నోరు విప్పాలని, ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉందంటూ పరోక్షంగా పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు రకరకాల ఊహాగానాలకు దారితీశాయి. ముఖ్యంగా కొండా సురేఖ లాంటి సీనియర్ నేతకు కేబినెట్ నుంచి స్థానం తప్పించడం వెనుక పార్టీ అంతర్గత సమీకరణాలు కారణమనే ప్రచారం సాగుతోంది. సురేఖ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర అలజడి సృష్టించాయి. బీసీ సామాజికవర్గానికి చెందిన సీనియర్ నాయకురాలిగా సుదీర్ఘ అనుభవం ఉన్న ఆమె, పార్టీ అంతర్గత వేదికలపై కాకుండా విలేకరుల సమావేశంలో బహిరంగంగా వ్యాఖ్యానించడం రాజకీయంగా వేడి పుట్టించింది. విపక్షాలు ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వంపై పాలనాపరమైన ఒత్తిడి పెంచేందుకు కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు ఆయుధంగా మార్చుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానం ఈ అసంతృప్తి జ్వాలలను ఎలా చల్లారుస్తుందో చూడాలి. సురేఖ లేవనెత్తిన అంశాలపై పార్టీ అంతర్గతంగా ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది, ఆమెకు మరేదైనా కీలక బాధ్యతలు అప్పగిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. (Konda Surekha Bartaraf, CM Revanth Reddy, Telangana Cabinet, Telangana Politics, Revanths Sensational Decision, Nerella Sarada, gundu sudharani, TPCC, Telangana One, Telugu news, Konda murali)

Published on: Thu Sep 3, 2026 5:05PM

political-news-img

సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ చేశారు : కొండా సురేఖ

సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్‌మెయిల్ చేశాడు..! తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అంతర్గత కలకలం రేగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ మధ్య విభేదాలు చిలికి చిలికి గాలివానలా మారి చివరకు అధిష్ఠానం వద్దకు చేరాయి. పార్టీ హైకమాండ్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చి, బ్లాక్‌మెయిల్ రాజకీయం చేస్తూ తనను కేబినెట్ నుంచి తప్పించేందుకు కుట్ర పన్నుతున్నారని కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు. వరంగల్ వేదికగా కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక నేతలపై చేసిన వ్యాఖ్యలు ఈ విమర్శల తుఫానుకు మూలకారణంగా నిలిచాయి. దీనిపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వివరణ కోరగా, తన కుమార్తె ఒక స్వతంత్ర వ్యక్తి అని, ఆమె మాట్లాడిన వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని సురేఖ స్పష్టం చేశారు. అయితే, పార్టీ నేతల ఒత్తిడి పెరగడంతో అధిష్ఠానం పిలుపు మేరకు ఆమె ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌లతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తనపై ఏ విధమైన అవినీతి మరకలు లేవని, మంత్రిగా తన పనితీరు మెరుగ్గా ఉందని విన్నవించారు. తనపై చర్యలు తీసుకునే ముందు, మంత్రివర్గంలోని ఇతర నేతలపై వస్తున్న ఆరోపణలు, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించినట్లు సమాచారం. ఒక బీసీ మహిళా నేతనైనందుకే తనను కావాలని లక్ష్యంగా చేసుకుంటున్నారని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో అందరికీ ఒకే రకమైన నిబంధనలు వర్తింపజేయాలని, కొందరు మంత్రులపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినా పట్టించుకోకుండా డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అధిష్ఠానం ఒత్తిడి తెచ్చినా తాను మంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, ఒకవేళ సీఎం తెస్తున్న ఒత్తిళ్లకు తలొగ్గి బర్తరఫ్ చేయాలనుకుంటే చేసుకోమని సురేఖ బహిరంగంగానే సవాల్ విసిరారు. తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం ముమ్మాటికీ సరికాదని, కావాలని కొంతమంది నేతలతో ప్రెస్ మీట్లు పెట్టించి తనపై లీకులు ఇప్పిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ వేదికగా చోటుచేసుకున్న ఈ సంచలన పరిణామాలతో తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సీనియర్ మంత్రికి మధ్య నెలకొన్న ఈ పోరును అధిష్ఠానం ఏ విధంగా సర్దుబాటు చేస్తుందోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. వరంగల్ ప్రాంతంలో బలమైన వర్గపోరుగా మారిన ఈ వ్యవహారంలో అధిష్ఠానం కఠిన చర్యలకు దిగుతుందా లేక నష్టనివారణ చర్యలు చేపడుతుందా అనేది రాబోయే రెండు రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది. (Konda Surekha Bartaraf, CM Revanth Reddy, Telangana Cabinet, Telangana Politics, Revanths Sensational Decision, Nerella Sarada, gundu sudharani, Telangana One, Telugu news)

Published on: Thu Sep 3, 2026 4:21PM