సమైక్యం: రాజీవ్ విగ్రహానికి నిప్పు

posted on: Jul 31, 2013 4:57PM

 

united andhra pradesh, telangana united andhra pradesh

 

 

అనంతపురం జిల్లాలో తెలంగాణకు వ్యతిరేకంగా చెలరేగిన ఆందోళనల కారణంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సప్తగిరి సెంటర్లో జరిగిన ఆందోళనల సందర్భంగా నిరసన కారులు హింసకు పాల్పడ్డారు. వాహనాలు ధ్వంసం చేయడంతో పాటు రాజీవ్ గాంధీ విగ్రహానికి నిప్పు పెట్టారు. ముందుగా విగ్రహాన్ని చెప్పులతో కొట్టిన ఆందోళన కారులు తర్వాత దాన్ని అగ్నికి ఆహుతి చేశారు. విగ్రహం అంటుకున్నాక దాన్ని కూలగొట్టారు. స్థానిక పోలీసులు, కేంద్ర బలగాలు తీవ్రంగా అడ్డుకున్నా ఫలితం లేకపోయింది. లాఠీ ఛార్జి చేస్తున్నా ఆందోళన కారులు తగ్గలేదు. ఇక్కడే కాదు అనంతపురం జిల్లా వ్యాప్తంగా కనిపించిన రాజీవ్, ఇందిరల విగ్రహాలన్నీ ఆందోళన కారుల ఆగ్రహానికి దెబ్బతిన్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...