టీ-అసెంబ్లీలో గందరగోళం, 32మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్

posted on: Oct 5, 2015 12:10PM

తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం ఏర్పడింది, రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని, అన్నదాతల ఆత్మహత్యలను ఆపేందుకు చర్యలు చేపట్టాలంటూ విపక్షాలన్నీ శాసనసభలో ఆందోళనకు దిగాయి, ప్రభుత్వం అందుకు సానుకూలంగా స్పందించకపోవడంతో విపక్ష సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు, దాంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది, సభ సజావుగా జరిగేందుకు అటు ప్రభుత్వం, ఇటు స్పీకర్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో 32మంది ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు. ప్రతిపక్ష నేత జానారెడ్డి, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మినహా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైసీపీ, సీపీఐ, సీపీఎంకి చెందిన 32మంది ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...