Latest News

మహారాష్ట్రలో పొతులు కట్టయ్యాయి.. కొత్త కూటమి ప్రయత్నాలు

posted on: Sep 26, 2014 9:26AM

 

బీజేపీ - శివసేన, కాంగ్రెస్ - ఎన్సీపీ మధ్య పొత్తు చిత్తు కావడంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బహుముఖ పోటీ అనివార్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 288 సీట్లకు పోటీ చేయనున్నట్టు బీజేపీ ప్రకటించింది. ఈ రెండు పార్టీల మధ్య పాతికేళ్ళ నాటి బంధం సీట్ల సర్దుబాటులో అవగాహన కుదరకపోవడం వల్ల తెగిపోయింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎన్సీపీకి మధ్య వున్న సుదీర్ఘమైన బంధం కూడా సీట్ల పొత్తు కుదరకపోవడం వల్ల తెగిపోయింది. ఇలా ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా పోటీ చేయడం వల్ల నాలుగు పార్టీలకూ నష్టం జరిగే అవకాశం వుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు చేయడం, వాటి ఉపసంహరణలోగా ఈ రెండు జట్ల మధ్య మళ్ళీ అవగాహన కుదిరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వెలిబుచ్చుతున్నారు. భారతీయ జనతా పార్టీ- శివసేన మధ్య పొత్తు కుదిరినట్టే కుదిరి బంధం తెగిపోవడం విచిత్రం. ఇదిలా వుండగా మహారాష్ట్రలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్సీపీ మద్దతు ఉపసంహరించింది. దాంతో ప్రభుత్వం కూలిపోయే అవకాశం కనిపిస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...