శ్రీవారి బ్రహ్మోత్సవానికి అంకురార్పణ... పట్టు వస్త్రాలు

 

కలియుగ ప్రత్యక్ష దైవం శీ తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం నాడు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవానికి గురువారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే శుక్రవారం నాడు సాయంత్రం ఐదున్నర గంటల తర్వాత ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతం పెద్ద శేషవాహనం మీద నాలుగు మాడ వీధుల్లో విహరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజున జరిగే గరుడోత్సవానికి ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుమలకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి సతీసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu