పల్టీ కొట్టిన ఆర్మీ వాహనం....
Published on: Thu Jun 8, 2017 12:10PM

జమ్మూకశ్మీర్లో ఆర్మీ వాహనం ప్రమాదానికి గురైంది. వివరాల ప్రకారం.. జమ్మూకశ్మీర్లోని సోఫియాన్ జిల్లాలో ఆర్మీ వెహికల్ లో జవాన్లు వెళుతుండగా.. వారిపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో డ్రైవర్ అదుపుతప్పడంతో వాహనం పల్టీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ.. 12 మంది జవాన్లు గాయలపాలైనట్టు సమాచారం. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


