టి.కాంగ్రెస్ సభా వేదికపై 120 నేతలు
posted on Jun 29, 2013 4:30PM
.jpg)
ఆదివారం జరగనున్న తెలంగాణ కాంగ్రెస్ సభలో వేదికపై రికార్డు స్థాయిలో నేతలు కూర్చోబోతున్నారు. తెలంగాణలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా మిగతా అందరూ ఈ సభకు వస్తున్నారు. బహిరంగసభ వేదిక మీద కేవలం సోనియా, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్ ల ఫోటోలే ఉంచుతున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల నుండి ప్రజలు హాజరయ్యేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే సంగారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి తాను ఈ సభకు హాజరుకానని, తనకు ఆహ్వానం రాలేదని అన్నారు. సభా వేదిక మీద 120 మందికి పైగా నేతలు ఆసీనులయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలోని పది జిల్లాల నుండి పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి తమ సత్తా చాటాలని వారు ఉవ్విళ్లూరుతున్నారు.