‘ఇంటింటి రామాయణం’ ద్వారా ఓటీటీలోకి నవ్యస్వామి ఎంట్రీ..
on Dec 1, 2022
బుల్లితెర సీరియల్ నటి నవ్య స్వామి ఓటీటీ ఫ్లాట్ఫాం మీద తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్దమయ్యింది. స్మాల్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎంతోమంది ఛాన్స్ దొరకడమే ఆలస్యం ఓటీటీలోకి అడుగు పెడుతున్నారు. ఇక ఇప్పుడు నవ్యస్వామి వంతొచ్చింది. ఆహా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ద్వారా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి "ఇంటింటి రామాయణం" మూవీతో ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీలో నవ్య స్వామి లీడ్ రోల్ లో నటిస్తోంది. ఇక ఈ మూవీ టీజర్ నవంబర్ 25న విడుదల చేశారు. ఐతే ఈ మూవీ డిసెంబర్ 16 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు మేకర్స్.
నాగ వంశీ సమర్పణలో మారుతి టీం, ఐవీఎఫ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో సురేష్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణకి జోడీగా నవ్యస్వామి కనిపించబోతోంది. ఈమె 'నా పేరు మీనాక్షి', 'ఆమె కథ' వంటి టీవీ సీరియల్స్ తో పాపులారిటీని సంపాదించుకుంది. కొంతకాలం రవికృష్ణతో కలిసి కొన్ని షోస్, ఈవెంట్స్ లోనూ, ఢీ షోలోనూ కనిపించింది. మరి ఈ మూవీలో నవ్యస్వామి ఎలా నటించింది.. ఆడియన్స్ నుంచి ఎన్ని మార్క్స్ తెచ్చుకోబోతోందో తెలియాలి అంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
నరేష్, గంగవ్వ, బిత్తిరి సత్తి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తున్నారు.
Also Read