భూషణ్ కోసం తిలోత్తమ బ్యాచ్..విశాల్ ఆన్వేషణ!
on Aug 8, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `త్రినయని`. గత కొన్ని వారాలుగా జీ తెలుగులో ప్రసారం అవుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సీరియల్ ఆద్యంతం ఆసక్తికర మలుపులు ట్విస్ట్ లతో సాగుతూ విశేషంగా అలరిస్తోంది. పవిత్రా జయరామ్, అనిల్ చౌదరి, ద్వారకేష్ నాయుడు, విష్ణుప్రియ, భావనారెడ్డి, శ్రీసత్య, నిహారిక హర్షు తదితరులు నటించారు. భూషణ్ మిస్టరీ తనని వేధిస్తుండటంతో అతని గురించి విశాల్ తెలుసుకోవడం మొదలు పెడతాడు.
ఈ క్రమంలో అతని అడ్రస్ లభిస్తుంది. ఇదే విషయాన్ని నయనితో చెబుతాడు. విశాల్ చెప్పగాఏ ఒక్కసారిగా నయని షాక్ అవుతుంది. అది గమనించిన విశాల్ అదేంటీ హ్యాపీగా ఫీలవుతావు అనుకుంటే అదేంటీ షాక్ అయిపోయావ్ అంటాడు. అంతే కాకుండా రేపు ఉదయాన్నే భూషణ్ ని పట్టుకునే ఆపరేషన్ ని స్టార్ట్ చేస్తానంటాడు. ఈ విషయం తెలుసుకున్న తిలోత్తమ, కసి, వల్లభ కంగారు పడుతుంటారు. ఇదే సమంలో భూషణ్ గనక విశాల్ కి దొరికితే ఇదే రోజు మీ ప్రాణం పోతుందేమోనని నాకు డౌట్ గా వుందని కసి కంగారు పడుతూ వుంటుంది.
అది అనుమానం కాదు నిజం అంటుంది తిలోత్తమ. మరెలా మమ్మి తనని అడ్డుకోవడం అంటూ వల్లభ చెబుతాడు. విశాల్ కంటే ముందే మనమూ బస్తీకి వెళ్లాలి అని తిలోత్తమ చెబుతుంది. అంతా మారు వేశాల్లో బన్తీకి బయలుదేరతారు. విశాల్ ఓ పక్క... తిలోత్తమ బ్యాచ్ మరో పక్క భూషణ్ కోసం వేట మొదలు పెడతారు. ఈ క్రమంలో ముందు భూషణ్ ఆచూకీ ఎవరికి తెలిసింది అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.