మూగజీవాలకు ఒక గుడ్ న్యూస్ చెప్పిన రష్మీ!
on Oct 7, 2022
యాంకర్ గా రష్మీ ఇప్పుడు బుల్లితెర మీద ఒక స్టార్. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తూ వారంలో మూడు రోజుల పాటు ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. మంచి సినిమా ఆఫర్స్ వస్తే అందులో కూడా తన టాలెంట్ చూపిస్తూ ఫుల్ స్క్రీన్ స్మాల్ స్క్రీన్ అన్న తేడా లేకుండా అవకాశాలను వినియోగించుకుంటోంది.
ఎంతో హ్యాపీ గా ఉండే రష్మీ తన మనసులో మూగ జీవాలంటే ఆవేదనతో ఉంటూనే ఉంటుంది. తన ఇన్స్టాగ్రామ్ పేజీలో తన ఫొటోస్ కన్నా ఇలా మూగజీవాలు పడుతున్న బాధల్ని ఎక్కువగా పోస్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ని కూడా షేర్ చేసింది. అది ఏంటంటే ఆకాశ ఎయిర్ లైన్స్ వాళ్ళు ప్యాసెంజర్స్ తో పాటు వాళ్ళ పెట్స్ కి కూడా త్వరలోనే అనుమతి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. బుకింగ్స్ అక్టోబర్ 15 నుంచి మొదలు కాబోతున్నాయి. ఎప్పటికీ ఇదొక గుడ్ న్యూస్ అంటూ తన ఇన్స్టా స్టేటస్ లో పోస్ట్ చేసింది. రష్మీ యానిమల్ లవర్. వాటికి హాని జరిగితే ఆమె మనసు భరించలేదు.
మూగజీవాల పట్ల అమానుషంగా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకునేలా కూడా సంబంధిత అధికారులకు ఆమె ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉంటుంది. రీసెంట్ ఆమె ఒక పోస్ట్ పెట్టింది. ''జంతువులకు సాయం చేసే పరిస్థితి అందరికీ ఉండదు. కానీ వాటికి హాని చేయకూడదని అనే విషయం కూడా అందరికీ తెలుసు" అని చెప్పింది. వాటికి హెల్ప్ చేయకపోయినా పర్లేదు కానీ వాటిని హింసించే రైట్ ఎవరికీ లేదు అంటూ ఘాటుగా తిట్టింది ఈ పోస్ట్ ద్వారా.
Also Read