24 ఆడియో ఫంక్షన్ కు భారీగా వచ్చిన జనం..!
on Apr 12, 2016
ఒకప్పుడు తమిళ సినిమాలు రిలీజైపోయిన తర్వాత, ఇక్కడ ఎవరైనా చూసి నచ్చితే, తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మార్కెట్ పెంచుకునే వ్యూహంలో భాగంగా, డైరెక్ట్ గా తమిళం వాళ్లే తెలుగులోకి రిలీజ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగులో సూపర్ క్రేజ్ ఉన్న సూర్య, విక్రమ్ లాంటి వాళ్లందరూ ఇదే దారిని ఫాలో అవుతున్నారు. నిన్న సాయంత్రం శిల్పకళావేదికలో సూర్య ' 24 ' తెలుగు ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరిగింది. సోమవారం అయినా, తమిళ సినిమా అయినా ఆడియన్స్ మాత్రం చాలా భారీగానే ఈ వేడుకకు రావడం విశేషం. సూర్య మాట్లాడుతున్న సమయంలో, విజిల్స్ వేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు ఫ్యాన్స్. గత రెండు మూడేళ్లుగా సరైన హిట్ లేకపోయినా, సూర్య సినిమాలకు జరుగుతున్న బిజినెస్, పెరుగుతున్న ఫ్యాన్ బేస్, తెలుగు మార్కెట్ లో సూర్య క్రేజ్ ను చూపిస్తోంది. మూవీకి నిర్మాత కూడా తనే కావడంతో, రిలీజ్ ను హీరో సూర్య స్వయంగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే 24 ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించుకుంది. సినిమా హిట్ అయితే, సూర్య తెలుగు మార్కెట్ మరింతగా విస్తరిస్తుందనడంలో డౌట్ లేదు.
Also Read