English | Telugu

అనసూయ 45 వేలకు ఈవెంట్ చేస్తుందా?

'జబర్దస్త్'లో కొన్ని వారాలుగా ఫాహిమా (ఫైమా)కు స్పేస్ దొరుకుతోంది. టిపికల్ కామెడీ టైమింగ్‌తో ఫన్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలో ఫాహిమా హద్దు మీరుతున్నట్టు కనబడుతోంది. 'జబర్దస్త్'లో బాడీ షేమింగ్ ఎప్పటి నుండో ఉంది. ఇన్నాళ్లూ ఇతరుల అందాన్ని హేళన చేస్తూ ఎవరో ఒకరు పంచ్‌లు వేసేవారు. అయితే, తన అందంపై ఫాహిమా పంచ్‌లు వేసుకుంటోంది.

నెక్స్ట్ వీక్ వెంకీ మంకీస్ స్కిట్‌లో ఫాహిమా చేసింది. ప్రోమో చూస్తుంటే... 'శక్తి' సినిమా స్పూఫ్ చేసినట్టు ఉన్నారు. అందులో ఫాహిమా, బాబుకు మధ్య ఓ సీన్ ఉంది. 'నువ్వు నాకు కావాలి' అని బాబు అంటే... 'ఇదే మాట స్కిట్ అయిపోయాక చెప్పు. వస్తా' అని ఫాహిమా అంటుంది. అదిరే అభి స్కిట్‌లో రామును పట్టుకుని టోంబ్రి అన్నది. స్కిట్ తర్వాత కూడా రెచ్చిపోయింది. ఫాహిమా పంచ్‌లు పేలుతున్నాయి కాబట్టి కంటిన్యూ చేస్తారో? లేదంటే టీమ్ లీడర్లు కట్ చేస్తారో? చూడాలి.

ఇక, నెక్స్ట్ వీక్ 'హైపర్' ఆది స్కిట్ విషయానికి వస్తే... జబర్దస్త్ టీమ్ లీడర్లు, జడ్జ్‌లకు వయసు అయిపోతే, ముసలోళ్లు అయితే ఎలా ఉంటారనే థీమ్ తీసుకుని స్కిట్ చేశాడు. అందులో రామ్ ప్రసాద్ 'నా వేళ్ళు చూశావా? ఎలా అయిపోయాయో?' అంటే... 'అందరికీ గోకి గోకి గోళ్లు పోతే నీకు వేళ్ళు తిరిగిపోయాయి ఏంటి?' అని ఆది పంచ్ వేశాడు. 'ఆ లెక్కన చూస్తే నీకు వేళ్లే ఉండకూడదు' అని రామ్ ప్రసాద్ కౌంటర్ పంచ్ వేశాడు. 'నీకు గోళ్లు, నాకు వేళ్ళు అంటే ఆ సుధీర్ గాడికి ఏం అరిగిపోయి ఉంటాయో?' అని ఆది అనడంతో అందరూ నవ్వేశారు.

అనసూయ పాత్రను రైజింగ్ రాజు చేశాడు. వయసు అయిపోయిన తర్వాత అనసూయకు సరిగా వినపడదని, ఓ ఈవెంట్ కోసం 90 వేలు ఇస్తామంటే... 65 వేలు అడుగుతున్నట్టు చూపించారు. అలా కాదు... 65 ఇస్తామంటున్నారని ఆది చెప్పబోతే... 45వేలకు ఒప్పుకొన్నట్టు కన్‌క్లూజన్ ఇచ్చారు. రోజా పళ్ళ సెట్ తీసుకురమ్మని అనడం, ఆది డాన్స్ అంటే సెలైన్ పెట్టమని అడగటం నవ్వించాయి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.