English | Telugu

 `గుప్పెడంత మ‌న‌సు`: రాత్రి వ‌సు, రిషి ల మ‌ధ్య ఏం జ‌రిగింది?

రిషి, వసుల చిలిపి త‌గాదాలు, గిల్లిక‌జ్జాల‌ నేప‌థ్యంలో సాగుతున్న సీరియ‌ల్ `గుప్పెడంత మ‌న‌సు`. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా సాగుతూ ఆక‌ట్టుకుంటున్న ఈ సీరియ‌ల్ ఈ శ‌నివారంలో 303వ ఎపిసోడ్‌లోకి ఎంట‌ర్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలో స‌లు ఆస‌క్తిక‌ర స‌న్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ రోజు హైలైట్స్ ఏంటో ఒక‌సారి లుక్కేద్దాం.

వ‌సు, మ‌హీంద్ర రెస్టారెంట్‌లో క‌లుద్దామ‌ని అనుకున్న విష‌యం తెలుసుకున్న రిషి చాలా కాలంగా ద్వేషిస్తున్న జ‌గ‌తి కారులోనే రెస్టారెంట్‌కి బ‌య‌లుదేర‌తాడు. కార్ డ్రైవ్ చేస్తూ రిషి.. వ‌సు ఫ్యూచ‌ర్ ప్లాన్స్ ఏంట‌ని జ‌గ‌తిని అడుగుతాడు. అప్పుడు జ‌గ‌తి .. వ‌సు ఏదంటే అదే ..దానికి నేను హెల్ప్ చేస్తాను అంతే` అంటుంది. వెంట‌నే నాకు వ‌సు కావాలి మేడ‌మ్ `అంటాడు రిషి. ఆ మాట‌లు విన్న జ‌గ‌తి షాక్‌కు లోన‌వుతుంది.

మాట మార్చిన రిషి మ‌న కాలేజీలో ఫ్యాక‌ల్టీ హెడ్‌గా వ‌సు కావాలంటాడు. అయితే నేను చెప్ప‌గ‌ల‌ను కానీ ఒప్పించ‌లేను క‌దా సార్ `అంటుంది జ‌గ‌తి. అడ‌గ‌డం అయితే మీరెందుకు త‌న‌ని ఒప్పించ‌మ‌ని మీకు బాధ్య‌త ఇస్తున్నాను` అంటాడు రిషి. ఇలా వీరి సంభాష‌ణ జ‌రుగుతుండ‌గానే కార్ ఆగుతుంది. క‌ట్ చేస్తే... రాత్రి కాలేజీలో రిషి బాస్కెట్ బాల్ ఆడుతుంటాడు. అదే స‌మ‌యానికి వ‌సు అక్క‌డికి వ‌స్తుంది. త‌న‌ని చూసి ఇదేంటి ఇలా వ‌చ్చావ్‌? ` అంటాడు రిషి. అనుకోకుండా వ‌చ్చాను సార్ అంటుంది వ‌సు.. వెంట‌నే `నీకు బాస్కెట్ బాల్ ఆడ‌టం వ‌చ్చా? అంటాడు రిషి. రాదు రాదు అంటూనే రిషితో క‌లిసి వ‌సు బాస్కెట్ బాల్ ఆడుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.