English | Telugu

బిగ్ బాస్ త‌మిళ్ 5: క‌మ‌ల్ ప్లేస్‌లో ర‌మ్య‌కృష్ణ వ‌చ్చేశారు!

బిగ్ బాస్ త‌మిళ్ 5 హోస్ట్ అయిన క‌మ‌ల్ హాస‌న్‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయి, హాస్పిట‌ల్‌లో చేర‌డంతో వీకెండ్ ఎపిసోడ్‌కు ఆయ‌న స్థానంలో ప్ర‌ముఖ సీనియ‌ర్ యాక్ట్రెస్ ర‌మ్య‌కృష్ణ వ‌చ్చారు. క‌మ‌ల్ హౌస్‌మేట్స్‌తో వీడియో కాల్ ద్వారా ఇంట‌రాక్ట్ అవుతున్న వీడియో క్లిప్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన మేక‌ర్స్‌, ఆయ‌న కోలుకొని తిరిగి వ‌చ్చేంత‌వ‌ర‌కు ర‌మ్య‌కృష్ణ హోస్ట్‌గా కొన‌సాగుతారంటూ ఆమెను ప‌రిచ‌యం చేశారు.

ఈ న్యూస్‌ను అనౌన్స్ చేసేందుకు మేక‌ర్స్ ఒక ప్రోమో వీడియోను షేర్ చేశారు. గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన ర‌మ్య‌కృష్ణ గోల్డ్ క‌ల‌ర్ చీర‌లో బ్యూటిఫుల్‌గా క‌నిపిస్తున్నారు. బిగ్ బాస్ ఫ్యాన్స్ సైతం ర‌మ్య‌కృష్ణ ఈ షోను ఎలా హోస్ట్ చేస్తారో చూడాల‌ని ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఆమె బిగ్ బాస్ సెట్స్‌పైకి రావ‌డం ఇదే మొద‌టిసారి కాదు. ఇదివ‌ర‌కు బిగ్ బాస్ తెలుగు 4 వీకెండ్ ఎపిసోడ్‌కు నాగార్జున ప్లేస్‌లో ఆమె హోస్ట్‌గా చేసి, అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నారు.

బిగ్ బాస్ త‌మిళ్ 5లో కొన్ని ఇంట్రెస్టింగ్ వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు క‌నిపిస్తున్నాయి. ఇంత‌కుముదు షో నుంచి ఎలిమినేట్ అయిన అభిషేక్ రాజా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మ‌రోసారి హౌస్‌లోకి వ‌చ్చాడు. అలాగే హీరో విజ‌య్ స‌న్నిహితుడు సంజీవ్ కూడా ఈ వారం షోలో ఎంట్రీ ఇచ్చాడు.

Also read: `బంగార్రాజు`పైనే `శివ‌గామి` ఆశ‌లు!

కాగా, ఇటీవ‌ల యు.ఎస్‌.కు వెళ్లి తిరిగొచ్చిన క‌మ‌ల్ హాస‌న్‌కు క‌రోనా పాజిటివ్ అని తేలడంతో చెన్నైలో శ్రీ‌రామ‌చంద్ర హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న కోలుకొనేవ‌ర‌కు కుమార్తెలు శ్రుతి, అక్ష‌ర‌, శ్రుతి బాయ్‌ఫ్రెండ్ శంత‌ను హ‌జారికా చెన్నైలోనే ఉండ‌నున్నారు. త‌మ తండ్రి కోలుకుంటున్నార‌నీ, ఆయ‌న ఆరోగ్యం గురించి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌నీ శ్రుతి చెప్పారు.

Also read: ష‌ణ్ణుతో హ‌గ్గుల‌పై సిరి ప్రియుడి షాకింగ్ రియాక్ష‌న్‌!

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.