English | Telugu
నామినేషన్లో శివాజీ మాస్ ఎలవేషన్.. హౌజ్ లో రతిక బంఢారం బయటపడిందా?
Updated : Sep 13, 2023
బిగ్ బాస్ సీజన్-7 గ్రాంఢ్ గా లాంఛ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇందులో హౌజ్ లోకి మొత్తంగా పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఉండగా, అందులో కిరణ్ రాథోడ్ గతవారం ఎలిమినేట్ అయింది. అయితే సోమవారం స్టార్ట్ అయిన నామినేషన్లు మంగళవారానికి చేరుకున్నాయి. సోమవారం రోజు పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసిన అమర్ దీప్.. హీరో స్థానం నుండి జీరోకి పడిపోయాడు. బీటెక్ చదివినోడు గోప్పా? రైతు గొప్పా అంటూ రైతులని తక్కువ చేసి మాట్లాడిన అమర్ దీప్ ని ఇప్పటికే రైతులంతా వ్యతిరేకిస్తున్నారు. కాగా గౌతమ్ కృష్ణ తెలిసి తెలియకుండా నామినేషన్ చేశాడు. దాదాపు నెక్ట్ వీక్ ఎలిమినేషన్ లో గౌతమ్ కృష్ణ ఉంటాడని అందరు అనుకుంటున్నారు.
కాగా మంగళవారం జరిగిన నామినేషన్లో పల్లవి ప్రశాంత్ ని, శివాజీని శోభాశెట్టి నామినేట్ చేసింది. దాని తర్వాత శోభాశెట్టిని శివాజీ నామినేట్ చేశాడు. ఇక మరొక నామినేషన్ కోసం బిగ్ బాస్ అడిగిన శివాజీ రెండవ నామినేషన్ వేయలేదు. ఇక కాసేపు బిగ్ బాస్ తో డిస్కషన్ జరిగాక అమర్ దీప్ ను నామినేట్ చేశాడు శివాజీ. శోభా శెట్టి నామినేషన్ తర్వాత శివాజీకి, శోభాశెట్టికి మధ్య వాగ్వాదం జరిగింది. నువ్వెంత ? వెళ్ళిపో అంటూ శోభాశెట్టిని అనగా.. మీరెవరు నాకు చెప్పడానికి బిగ్ బాస్ చెప్తే వెళ్తానని శోభాశెట్టి చెప్పింది.
రతికని గౌతమ్ కృష్ణ నామినేట్ చేశాడు. లవ్ ఆంగిల్ అనిపిస్తుందని నాతో చెప్పినవా లేదా అని గౌతమ్ కృష్ణ అన్నాడు. నేను నీతో అన్నానా అని రతిక అంది. అక్కడ ఎవరో ఉన్నారు , గుర్తులేదని గౌతమ్ కృష్ణ అనగా.. పిచ్చి పిచ్చి నామినేషన్ ప్రాసెస్ కాదిక్కడ అని రతిక వాదిస్తుంటే.. ఎందుకలా అరుస్తున్నావ్ రతిక, నాకు అరవడం వచ్చని గౌతమ్ కృష్ణ వాయిస్ రేజ్ చేశాడు. ఇక రతికని నామినేట్ చేసి వెళ్ళిపోయాడు గౌతమ్ కృష్ణ. రతికని టేస్టీ తేజ నామినేట్ చేశాడు.