English | Telugu

సూసైడ్ వరకూ వెళ్లిన 'జబర్దస్త్' కమెడియన్!

ఒక టైమ్‌లో 'జబర్దస్త్'లో తనను టీమ్ లీడర్‌గా తీసేశారని, అప్పుడు సూసైడ్ వరకూ వెళ్లానని 'రాకింగ్' రాకేష్ చెప్పాడు. కారు వేసుకొని వెళ్లి కావాలని చెట్టుకు గుద్దేశాన‌ని వివరించాడు. అయితే, 'చలాకి' చంటి వల్ల తాను ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నానని చెప్పుకొచ్చాడు.

"నన్ను టీమ్ లీడర్‌గా తీసేసిన సమయంలో చంటి అన్న తన టీమ్‌లోకి నన్ను తీసుకున్నాడు. నాకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నేను టీమ్ లీడర్‌గా ఉన్నానంటే... నాకు ఎప్పటికీ చంటి అన్న గుర్తు ఉంటారు" అని 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కార్యక్రమంలో 'రాకింగ్' రాకేష్ చెప్పాడు. అత‌ను ఈ విష‌యం చెబుతుంటే ఇంద్ర‌జ‌, సంగీత ద‌ర్శ‌కుడు కోటి, తోటి న‌టులంద‌రూ క‌దిలిపోయారు. టీచర్స్ డే సందర్భంగా సెప్టెంబర్ 5న ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది.

'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఈటీవీలో ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారం టీచర్స్ డే కావడంతో 'ఆచార్యదేవోభవ' పేరుతో స్పెషల్ ఎపిసోడ్ చేశారు. దీనికి కోటి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. ఆల్రెడీ రిలీజైన ప్రోమో చూస్తుంటే... 'అదిరే' అభి, విష్ణుప్రియ వేసిన డాన్స్, మిగతావాళ్లు పంచ్ డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. రామ్ ప్రసాద్ తన గురువు అని బాబు అంటుంటే... రామ్ ప్రసాద్ వద్దని చెప్పడం హైలైట్.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.