English | Telugu
సుధీర్కు కన్నుకొడుతూ.. పెదాలు కొరుక్కుంటూ రెచ్చిపోయిన రష్మీ!
Updated : Jun 12, 2021
బుల్లితెర జోడీ సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీలకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. 'జబర్దస్త్', 'ఢీ' వంటి షోలలో ఈ జంట చేసే రచ్చ మాములుగా ఉండదు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడంతో ఈవెంట్ మేనేజర్స్ కూడా ఈ పెయిర్ తో మ్యాజిక్ రిపీట్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన 'ఢీ 10' ప్రోమోలో వీరిద్దరి రొమాంటిక్ ట్రాక్ హైలైట్ అయింది. అందరూ చూస్తుండగానే సుధీర్కు కన్నుకొడుతూ రష్మీ రెచ్చిపోవడం హాట్ టాపిక్ గా మారింది.
ముందుగా యాంకర్ ప్రదీప్ డల్ గా ఉన్న సుధీర్ను స్టేజ్ పైకి పిలిచాడు. అతడితో పాటు హైపర్ ఆది కూడా వచ్చాడు. వీరిద్దరూ ఒకేరకమైన బట్టలు వేసుకొని కనిపించారు. సుధీర్ పర్పుల్ కలర్ వేసుకోవడంతో.. ప్రదీప్ పరుపుల అంటూ సెటైర్ వేశాడు. వెంటనే జడ్జి ప్రియమణి పరుపుల సుధీర్ అంటూ పరువు తీసేసింది. అనంతరం ప్రోమో చివర్లో రష్మీ-సుధీర్ ల రొమాన్స్ ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అందరూ చూస్తుండగానే డైరెక్ట్ గా సుధీర్కి కన్నుకొడుతూ పక్కకు పిలిచింది రష్మీ. అంతేకాదు.. అతని వంక చూస్తూ మునిపంటితో పెదాలు కొరుక్కుంది. దీంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. ప్రియమణి అయితే నోరెళ్లబెట్టింది. ఇక రష్మీ అలా పిలవడంతో సుధీర్ పరవశంతో మైమరచిపోయాడు. మాటల్లో చెప్పలేనంత ఆనందంతో మురిసిపోయాడు.