English | Telugu

"నాకు హగ్ ఇవ్వకపోయినా నా తమ్ముడికి ఇచ్చారు.. అది చాలు''

డాన్స్ రియాలిటీ షో 'ఢీ'లో జడ్జ్‌గా చేస్తున్న హీరోయిన్ ప్రియమణి హగ్ కోసం హైపర్ ఆది విపరీతంగా పరితపిస్తాడు. మామూలుగా షోలో ప్రియమణిని ప్రియా... ప్రియా... అని ప్రేమగా పిలుస్తూ ఉంటాడు. అప్పుడప్పుడూ అతడిని ప్రియమణి 'బావా' అని పిలుస్తుంది. ఇవ్వక ఇవ్వక ఒకరోజు ఆదికి ప్రియమణి హగ్ ఇచ్చింది. ఆ రోజు కో టీమ్ లీడర్ సుధీర్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. 'నాకు హగ్ ఇవ్వకపోయినా... నా తమ్ముడికి ఇచ్చారు. అది చాలు' అని సుధీర్ వీర డైలాగ్ చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ సేమ్ సీన్ 'ఢీ'లో రిపీట్ కానుంది. అయితే... సుధీర్ పాత్రను రష్మీ, ఆది పాత్రను దీపిక పోషించారు.

'ఢీ' అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో 'లెట్స్ వెల్కమ్ కింగ్స్ టీమ్ లీడర్స్' అని యాంకర్ ప్రదీప్ ఇన్వైట్ చేయగానే... రష్మీ, దీపిక వచ్చారు. ప్రోమోలో కనిపించింది కాసేపైనా సరే... సుధీర్‌ను రష్మీ దింపేసింది. అలాగే, ఆదిని దీపిక! ప్రియమణి దగ్గరకు వెళ్లి దీపిక హగ్ తీసుకుంది. స్టేజి మీద రష్మీ 'ఇది చాలు' అంటూ సందడి చేసింది. వీళ్లిద్దరి యాక్టింగ్ చూసి సుధీర్, ఆది సహా అందరూ నవ్వుకున్నారు.

సుధీర్ స్టేజి మీద ఉన్నప్పుడు కిందనున్న సెట్ బాయ్స్, డాన్సర్లు 'అన్నా ఏయ్' అంటూ ఉంటారు. సుధీర్ రోల్ రష్మీ చేస్తున్న సమయంలో 'అన్నా ఏయ్' అంటూ గట్టిగా అరిచారు. వాళ్లకు ప్రదీప్ తోడు కలిశాడు. 'ఆగరా... వేస్తా! వేస్తా!' అని రష్మీ రిప్లై ఇచ్చింది. పూర్ణ దగ్గరకు వెళ్లినప్పుడు గులాబీ పువ్వును తినేసింది. 'సూపర్... అది కడగలేదు' అని ప్రదీప్ అనగానే వెంటనే నోట్లో రేకలు ఊసేసింది. ఇంకెంత సందడి చేశారో తెలియాలంటే వచ్చే బుధవారం ఎపిసోడ్ చూడాలి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.