English | Telugu

బిగ్ షాక్‌.. 'బిగ్‌బాస్-13' విన్నర్, 'చిన్నారి పెళ్లికూతురు' హీరో మృతి!

ప్రముఖ బాలీవుడ్-టీవీ యాక్టర్, హిందీ 'బిగ్ బాస్' పదమూడో సీజన్ విన్నర్ సిద్ధార్థ్ శుక్లా మృతి చెందారు. ఆయన వయసు 40 సంవత్సరాలు. గురువారం ఉదయం తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికి మృతి చెందినట్టు కూపర్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సిద్ధార్థ్ శుక్లాకు తల్లి, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.

'బాలికా వధు' సీరియల్ సిద్ధార్థ్ శుక్లాకు ప్రేక్షకుల్లో విపరీతమైన గుర్తింపు తీసుకొచ్చింది. తర్వాత అతను 'బిగ్ బాస్ - 13' విన్నర్ గా నిలిచారు. ఇటీవల 'బిగ్ బాస్' ఓటీటీలోనూ కనిపించాడు. 'హంప్టీ శర్మ కె దుల్హనియా'లో సపోర్టింగ్ రోల్ ద్వారా సిల్వర్ స్క్రీన్ కు సిద్ధార్థ్ పరిచయమయ్యాడు. ఏక్తా కపూర్ నిర్మించిన 'బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్'లో అగస్త్య పాత్రలో నటించాడు. రియాలిటీ షోల్లో కూడా కనిపించాడు. సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌కు విప‌రీత‌మైన క్రేజ్ ఉంది.

సిద్ధార్థ్ ఆక‌స్మిక మృతికి దేశంలోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండ‌స్ట్రీ అంతా ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌యింది. ప‌లువురు సెల‌బ్రిటీలు ఈ వార్త నిజం కాక‌పోతే బాగుండునంటూ సోష‌ల్ మీడియా అకౌంట్ల ద్వారా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ వార్త‌ను త‌ట్టుకోలేక‌పోతున్నామ‌ని సంతాపం వ్యక్తం చేశారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.