English | Telugu

అషురెడ్డిని ఆర్జీవీ ఎన్ని యాంగిల్స్‌లో చూపిస్తారో!

బిగ్‌ బాస్‌ బ్యూటీస్‌, ముఖ్యంగా హాట్‌ ఇమేజ్‌ ఉన్న యాంకర్స్‌ మీద రామ్‌గోపాల్‌ వర్మ మనసు పారేసుకున్నట్టు ఉన్నారు. మొన్నామధ్య బిగ్‌ బాస్‌కు వెళ్లొచ్చిన అరియానాను వర్మ ఇంటర్వ్యూ చేశారు. అది మరీ బోల్డ్‌గా ఉందని కామెంట్లు వినిపించాయి. అందులో వర్మ హాట్‌ టాపిక్స్‌ డిస్కస్‌ చేశారు. అరియానా అందాలను ఎవరూ చూపించని యాంగిల్స్‌లో చూపించారు. ఇప్పుడు మరో బిగ్‌ బాస్‌ బ్యూటీ అషురెడ్డిపై వర్మ కాన్సంట్రేట్‌ చేశారు. ఆమెను ఎన్ని యాంగిల్స్‌లో చూపిస్తారో, ఆమెతో ఏం టాపిక్స్‌ డిస్కస్‌ చేస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.

వర్మ తనను ఫొటోలు తీస్తున్న సమయంలో తీసిన వీడియో క్లిప్‌ను అషురెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ‘నో మీన్స్‌ నో... త్వరలో వస్తుంది. ఇట్స్‌ గోయింగ్‌ టు బి ఎపిక్‌’ అని అషురెడ్డి పేర్కొంది. దీన్నిబట్టి అమ్మాయిలు వద్దంటే వద్దు అనే టాపిక్‌ మీద డిస్కస్‌ చేసినట్టు తెలుస్తోంది.

అషురెడ్డిని తనదైన శైలిలో, లో యాంగిల్స్‌లో వర్మ ఫొటోలు తీశారు. దానిపై, వర్మతో అషురెడ్డి తీసుకున్న సెల్ఫీపై ఆల్రెడీ మీమ్స్‌ స్టార్ట్‌ అయ్యాయి. వర్మ టేస్ట్‌ సూపరని కొందరు అంటుంటే... వర్మ అలా ఫొటోలు తీయడం చూసి జాలి పడుతున్నానని ఇంకొందరు అన్నారు. ‘సిగ్గు లేదా నీకు ఛీఛీ’ అని ఒకరు అషురెడ్డి వీడియో కింద కామెంట్‌ చేశారు. ‘మరీ పాపులారిటీ కోసం ఇంత దిగజారాలా?’ అని ఇంకొకరు కామెంట్‌ చేశారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.