English | Telugu

"మేం మందు కొట్టని బ్యాచ్".. గర్వంగా చెప్పిన దీప్తి సునైన!

ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంటే ప్రేక్షకుల్లో కొంతమందికి చాలా చిన్నచూపు ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిల గురించి ఏవేవో అనుకుంటూ ఉంటారు. మోడ్రన్ డ్రస్సులు వేసుకోవడం వలన వాళ్ళను జడ్జ్ చేస్తూ ఉంటారు. సిగరెట్ తాగుతారని, మందు కొడతారని అపోహతో ఉంటారు. అయితే, తనది మందు కొట్టని బ్యాచ్ అని 'బిగ్ బాస్' ఫేమ్, సోషల్ మీడియా స్టార్ దీప్తి సునైన చెప్పింది. త‌ర‌చూ త‌న ఫొటోలు, త‌న యాక్టివిటీస్‌కు సంబంధించిన ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో ట‌చ్‌లో ఉంటుంది దీప్తి.

కాస్ట్యూమ్ డిజైనర్ నవ్య మరౌతు బర్త్ డే సెలబ్రేషన్స్ కు దీప్తి సునైన అటెండ్ అయ్యింది. 'బిగ్ బాస్' ఫేమ్స్ దేత్తడి హారిక, తీన్మార్ సావిత్రి, అఖిల్ సార్థక్, యాక్టర్ అండ్ సింగర్ నోయెల్, యూట్యూబ్ స్టార్లు తదితరులు అటెండ్ అయ్యారు. యూట్యూబ్ ఫిలిమ్స్ చేసే గోల్డీ, నవ్య మరౌతు, ఉదయ్ తేజ్ అనే వ్యక్తితో కలిసి 'ప్రౌడ్ నాన్ ఆల్కహాలిక్' అని దీప్తి సునైన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. కాఫీ తాగుతున్నట్టు ఇంకో స్టోరీ పోస్ట్ చేసింది.

దీప్తి సునైనను ఇంతకు ముందు ఎవరైనా కామెంట్ చేయడంతో ఇప్పుడు ఇలా చేసిందో, లేదంటే తాను నాన్ ఆల్కహాలిక్ అని చెప్పాలని అనుకుందో... మొత్తం మీద తాను మందు తాగనని ఆమె చెప్పింది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.