English | Telugu

"నాకింకా పెళ్లి కాలేదు... డైరెక్ట్ అత్తన‌వుతా!".. షాకిచ్చిన ర‌ష్మి!!

పెళ్లి గురించి రష్మీని ఎప్పుడు ప్రశ్నించినా మౌనమే సమాధానం అవుతుంది. అలాగే, వయసు గురించి కూడా! తన వయసు ఎంతనేది ఎప్పుడూ బయటపెట్టదు. అటువంటి రష్మీ నోటి నుండి వయసు, పెళ్లి గురించి వస్తే ఆశ్చర్యమే కదా! దాంతో 'ఆషాడంలో అత్తాకోడళ్లు' ఈవెంట్ లో ఆర్టిస్టులు అందరూ అవాక్కయ్యారు.

సండే సాయంత్రం ఐదు గంటలకు 'జీ తెలుగు'లో టెలికాస్ట్ కానున్న 'ఆషాడంలో అత్తాకోడళ్లు' ఈవెంట్ లో రష్మీ గౌతమ్ రచ్చ రచ్చ చేసిందని లేటెస్ట్ ప్రోమో చూస్తే తెలుస్తోంది. గతంలో రిలీజైన ప్రోమోలో 'మెరిసింది మేఘం' పాట పాడినట్టు రివీల్ చేశారు. ఇప్పుడు అంతకు మించి అన్నట్టు రష్మీ రెచ్చిపోయింది.

'ఆషాడంలో అత్తాకోడళ్లు'లో అత్తలు, కోడళ్లకు మధ్య కాంపిటీషన్లు పెట్టారు. కోడళ్లవైపు రష్మీ ఉన్నారు. మ్యూజికల్ చైర్స్ గేమ్ లో కోడలు ఒకరు ఓడిపోయారు. అంటే... కుర్చీలో కూర్చోలేక వెనక్కి వచ్చారు. అప్పుడు రష్మీ ఆమెను కొట్టింది. దాంతో 'హే... యు డోంట్ బికమ్ అత్త! నువ్వు కోడలు' అని శ్యామల ఆపింది. 'ఈ వయసులో నాకు ఇంకా పెళ్లి కాలేదు. నేను డైరెక్ట్ అత్తకు అప్‌గ్రేడ్ అవుతా' అని రష్మీ ఆన్సర్ ఇచ్చింది. దానికి అంతా షాక్!

ఇక, ఈవెంట్ లో రవి మీద రష్మీ వేసిన డైలాగ్స్ అయితే ఓవర్ ద బోర్డు అని చెప్పాలి. 'రవీ... నిజంగా! ఈసారి మధ్యలో వచ్చావో ఉన్నది కూడా తీసేస్తా', 'నువ్వు పైకిరా! నీకు ఉంటుంది. ఉన్నది కూడా ఇప్పేస్తాం' అంటూ రష్మీ రచ్చ చేశారు. ఫుల్ ఈవెంట్ టెలికాస్ట్ అయితే ఇంకెంత రచ్చ చేశారో తెలుస్తుంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.