English | Telugu

ఆ వీడియోపై స్పందించిన మెహబూబ్..!

బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ (Mehaboob) హౌస్‌లో ఉన్నప్పుడు నబీల్‌తో ఓటింగ్ గురించి మాట్లాడాడు. మనకి ఓటింగ్ విషయంలో భయం అక్కర్లేదు.. ఎందుకంటే మన కమ్యూనిటీ ఓట్లన్నీ మనకే పడతాయి.. కానీ ఇద్దరూ నామినేషన్స్‌లో ఒకసారి ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఒకేసారి ఇద్దరూ ఉంటే మన ఓట్లు డివైడ్ అయిపోతాయంటూ మెహబూబ్ అన్నాడు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. (Bigg Boss Telugu)

ఇక రీసెంట్ గా మెహబూబ్ ఎలిమినేషన్ అయి బయటకు వచ్చాడు. ఎవరు చూపించారో ఏమో కానీ నబీల్ తో మెహబూబ్ మాట్లాడింది చూసి.. దానికి రెస్పాండ్ అయ్యాడు. బిగ్‌బాస్‌లో మేము గంటలు గంటలు మాట్లాడితే వాళ్లు చూపించేది ముప్పై సెకన్లు. అందులో నేను మాట్లాడిన ఒక సంభాషణలో చిన్న క్లిప్ బయట వేరే కోణంలో వెళ్లింది. దాని గురించి మాట్లాడదామనే వచ్చాను.. మనం బిగ్‌బాస్ లాంటి పెద్ద ప్లాట్ ఫామ్‌లో ఉన్నప్పుడు మనం మంచిగా ఆడితే మనం మంచిగా బిహేవ్ చేస్తే అరె మనలో ఒకడు అని చెప్పి మనల్ని ఇష్టపడతారు.. మనకి ఓట్లు వేస్తారని చెప్పిన కన్వర్సేషన్ అది. ఉదాహరణికి మన తెలుగు పాట ఆస్కార్స్‌కి నామినేట్ అయినప్పుడు మన పాట గెలవాలని చెప్పి మనమందరం కోరుకున్నాం.. అలాంటి సంభాషణే అది. కానీ నేను అన్నమాట చాలా మందిని హర్ట్ చేసింది.. చాలా మంది డిజప్పాయింట్ అయ్యారు.. నేను ప్రామిస్ చేస్తున్నా అది నా ఉద్దేశం కాదు.. దానికి నేను క్షమాపణలు చెబుతున్నా సారీ. డబ్ స్మాష్, రీల్స్, యూట్యూబ్‌లో చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ వచ్చాను.. ఏ కులం, ఏ మతం అనే ఫీలింగ్ లేకుండా మీరందరూ నన్ను సపోర్ట్ చేశారు. నేను స్ట్రాంగ్‌గా కమ్ బ్యాక్ ఇస్తా.. ఆడియన్స్‌గా మీరందరూ గెలిచారు.. ఒక కంటెస్టెంట్‌గా నేను ఫెయిల్ అయ్యాను.. ఐయామ్ సారీ అంటూ మెహబూబ్ చెప్పాడు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.