English | Telugu

"శ్రీదేవి నాకు రెండో అమ్మ".. మహేశ్వరి భావోద్వేగం!

‘గులాబీ’ హీరోయిన్‌ మహేశ్వరి గుర్తుందా? అదేనండీ శ్రీదేవి చెల్లెలు! అంటే.. సొంత చెల్లెలు కాదనుకోండి. పిన్ని కూతురు! చాలా రోజుల తర్వాత మహేశ్వరి టీవీ షోలో కనిపించారు. ‘క్యాష్‌’ ప్రోగ్రామ్‌కు ఆమెను తీసుకొచ్చారు. అందులో శ్రీదేవితో తనకున్న అనుబంధాన్ని మహేశ్వరి గుర్తు చేసుకున్నారు. తనకు శ్రీదేవి రెండో అమ్మలాంటిదని చెప్పారు. ఎమోషనల్‌ అయ్యారు.

‘‘కొంతమంది వదిలేసి వెళ్లిపోయినప్పుడు వాళ్ల ఫ్యామిలీ బాధపడతారు. కొంతమంది వెళ్లిపోయినప్పుడు ఇలా ప్రపంచమంతా బాధపడుతుంది. దటీజ్‌ శ్రీదేవిగారు’’ అని సుమ చెప్పారు. మహేశ్వరితో పాటు హీరోయిన్లు రాశి, సదా, శ్రద్ధా దాస్‌ అతిథులుగా వచ్చిన క్యాష్‌ షో శనివారం, సెప్టెంబర్‌ 4న టెలికాస్ట్‌ కానుంది.

ప్రజెంట్‌ సెలబ్రిటీలు అందరూ యూట్యూబ్‌ ఛానళ్ళు ప్రారంభించి... హోమ్‌ టూర్‌, కిచెన్‌ టూర్‌ అంటూ వీడియోస్‌ చేస్తున్నారు. దీనిని ‘క్యాష్‌’లో చూపించే ప్రయత్నం చేశారు. సదా హోమ్‌ టూర్‌ పేరుతో కాసేపు సందడి చేశారు. అందులో ఎంటరైన సుమ... ‘నేను అమ్మగారింట్లో పని చేస్తున్నా. పదేళ్ల నుంచి! నాకు జీతం పెంచలే ఇప్పటివరకూ’ అని కామెడీ చేశారు. ‘ఆర్య 2’ సెట్‌లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే ఏడ్చేదాన్ని అని తనకు ‘వాటర్‌ ట్యాప్‌’ అని పేరు పెట్టారని శ్రద్ధా దాస్‌ తెలిపారు. మొత్తంమీద ప్రోమో సందడిగా సాగింది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.