English | Telugu

టీవీ తార రాగిణి ఎవ‌రో మీకు తెలుసా?

'అమృతం' సీరియ‌ల్‌లో అంజి (గుండు హ‌నుమంత‌రావు) భార్య శాంత పాత్ర‌లో ఆడియెన్స్‌ను అమితంగా అల‌రించిన రాగిణి ఎవ‌రో నేటి త‌రంలోని చాలామందికి తెలీదు. ఆమె మొద‌ట 'వేమ‌న' టీవీ సీరియ‌ల్ ద్వారా దూర‌ద‌ర్శ‌న్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. అప్ప‌ట్నుంచి ఇప్ప‌టిదాకా లేడీ డిటెక్టివ్‌, అమృతం, నాన్న‌, రాధ మ‌ధు, ఇద్ద‌రు అమ్మాయిలు, అగ్నిసాక్షి, రెండు రెళ్లు ఆరు లాంటి సీరియ‌ల్స్ ద్వారా వీక్ష‌కుల‌కు బాగా స‌న్నిహిత‌మ‌య్యారు. ఆమె కామెడీ టైమింగ్‌, ఆమె హావ‌భావాలు అంద‌రినీ అల‌రిస్తుంటాయి.

రాగిణి స్వ‌త‌హాగా తెలుగు వ‌నిత అయినా బాల్య‌మంతా క‌ర్ణాట‌కలోని రాయ‌చూర్‌లో గ‌డిచింది. ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టి కృష్ణ‌వేణికి రాగిణి స్వ‌యానా చెల్లెలు. న‌టిగా సినీ రంగంలో ప్ర‌వేశించాల‌నే ఉద్దేశంతో, అక్క కృష్ణ‌వేణి ప్రోత్సాహంతో, మ‌ద్రాసులో వెంప‌టి చిన‌స‌త్యం మాస్ట‌ర్ ద‌గ్గ‌ర మూడేళ్ల‌పాటు ఆమె డాన్స్ అభ్య‌సించారు. ఆ త‌ర్వాత మ‌ద్రాస్ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చి స్థిర‌ప‌డిన త‌ర్వాత మొట్ట‌మొద‌ట‌గా 'వేమ‌న' టీవీ సీరియ‌ల్‌లో త‌న అక్క కృష్ణ‌వేణికి కూతురి పాత్ర‌లో న‌టించారు రాగిణి. ఆ త‌ర్వాత ఆమె వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా ఒక దాని త‌ర్వాత ఒక‌టిగా ప‌లు దూర‌ద‌ర్శ‌న్ సీరియ‌ల్స్‌లో న‌టించే అవ‌కాశం ల‌భించింది. ముఖ్యంగా 'ఎండ‌మావులు' సీరియ‌ల్‌లో భ‌ర్త‌ప‌ట్టే బాధ‌లు భ‌రించ‌లేక ఎదురుతిరిగి పోరాడిన యువ‌తిగా ఆమె పోషించిన సీత పాత్ర విశేష‌మైన పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చిపెట్టాయి. ఇప్ప‌టి ఆమె ఇమేజ్‌కు ఆ సీత క్యారెక్ట‌ర్ పూర్తి భిన్న‌మైన‌ది కావ‌డం గ‌మ‌నార్హం.

టీవీ సీరియ‌ల్స్ ద్వారా వ‌చ్చిన పాపులారిటీ వ‌ల్ల రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో 'గాయం' సినిమాలో గుమ్మ‌డి కూతురిగా న‌టించే అవ‌కాశం వ‌చ్చింది రాగిణికి. అప్ప‌ట్నుంచీ కేవ‌లం టీవీకే ప‌రిమితం కాకుండా అవ‌కాశం ల‌భించిన‌ప్పుడ‌ల్లా సినిమాల్లోనూ న‌టిస్తూ వ‌స్తున్నారు. అలా ఆమె న‌టించిన సినిమాల్లో అన్న‌, అంద‌రూ అంద‌రే, కిష్కింధ‌కాండ‌, సూప‌ర్ మొగుడు, ప‌విత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, గ‌ణేష్‌, అష్టా చ‌మ్మా, బాణం, ఈ రోజుల్లో, జులాయి, భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, మ‌హానుభావుడు లాంటి సినిమాలు ప్ర‌ముఖ‌మైన‌వి. మొద‌ట్లో సాత్విక పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకున్న రాగిణి ఇప్పుడు కామెడీ ట‌చ్ ఉన్న క్యారెక్ట‌ర్లు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం ఆమె 'అమృతం ద్వితీయం', 'చెల్లెలి కాపురం' సీరియ‌ల్స్‌లో న‌టిస్తున్నారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.