English | Telugu

'బిగ్ బాస్ 5' ప్రారంభానికి ముహూర్తం పెట్టేశారు!

'చెప్పండి బోర్‌డమ్‌కి గుడ్ బై... వచ్చేస్తుంది బిగ్‌బాస్ సీజన్ ఫైవ్' అంటూ కింగ్ అక్కినేని నాగార్జున బుల్లితెర మీద మరోసారి సందడి చెయ్యడానికి సిద్ధమయ్యారు. మూడోసారి 'బిగ్ బాస్' షోకి హోస్ట్ చెయ్యడానికి ఆయన రెడీగా ఉన్నారు. సెప్టెంబర్ తొలి వారం నుండి 'స్టార్ మా' ఛానల్‌లో షో స్టార్ట్ కానుందనేది తెలిసిన విషయమే. ఇప్పుడు ఏ తేదీ నుండి స్టార్ట్ చేస్తారనేది కూడా వెల్లడించారు.

సెప్టెంబర్ 5న సాయంత్రం 6 గంటలకు ఐదో సీజన్‌ గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు, శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు షో ప్రసారం కానుంది. ఆల్రెడీ కంటెస్టెంట్లను క్వారంటైన్ చేశారు. హౌస్‌లోకి ఎవరెవరు వెళతారనేది ముందుగా చెప్పే అలవాటు స్టార్ మాకు లేదు. కానీ, కొందరి పేర్లు అయితే కన్ఫర్మ్ అంటున్నారు. అందులో యాంకర్లు రవి, వ‌ర్షిణి, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ పేర్లు ఉన్నాయి.

రవి, షణ్ముఖ్ కాకుండా... 'టిక్ టాక్' దుర్గారావు పిలిస్తే వెళతానని అంటున్నారు. ఇంకా ఆర్‌జె కాజల్‌, శ్వేతా వర్మ, సిరి హనుమంతు, లోబో, ట్రాన్స్‏జెండర్ ప్రియాంక, యానీ మాస్టర్, కార్తీక దీపం భాగ్య అలియాస్ ఉమ, నటి లహరి పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరెవరు షోకి వెళతారో త్వరలో తెలుస్తుంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.