English | Telugu

దీపను చంపడానికి మారువేషంలో బయలుదేరిన మోనిత!

కార్తీక్‌ కోసం మోనిత ఎంతదూరమైనా వెళ్తుందని చెప్పడానికి, కార్తీక్‌ను సొంతం చేసుకోవడానికి ఎవరిని అడ్డు తొలగించడానికి అయినా వెనుకాడదని చెప్పడానికి ఈ రోజు (ఆగస్టు 19, 1122) ఎపిసోడ్‌ను ఉదాహరణగా చెప్పుకోవాలి. ఈరోజు ఏకంగా దీపను చంపడానికి మోనిత బయలుదేరింది. దీపను ఒంటరి చెయ్యడం కోసమే కార్తీక్ ను కేసులులో ఇరికిస్తుంది. అసలు, నేటి ఎపిసోడ్‌లో హైలైట్స్ ఏంటంటే...

కార్తీక్ ఫొటో చూస్తూ... పిల్లల్ని తప్ప దీపతో సహా మిగతా అందర్నీ చంపేస్తానని మోనిత చెబుతూ ఉండటంతో ఎపిసోడ్ మొదలైంది. తనను చంపకుండా కార్తీక్ వదిలేసినా... గన్ గురిపెట్టినప్పుడు 'నిన్ను చంపి జైలుకు వెళితే నా భార్య ఒంటరి అయిపోతుంది' అంటాడు. ఆ మాటలు మోనిత మనసుకు గుచ్చుకుంటాయి. దీపను ఒంటరి చెయ్యడం కోసం తాను చచ్చినట్టు నాటకం ఆడి, కార్తీక్ మీద కేసు పడేలా చేసి జైలుకు పంపిస్తుంది. ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుని... కార్తీక్ ఫొటో చూస్తూ, 'సారీ బాస్. నీ భార్యను చంపేస్తా. ఇకనుండి తనను అడ్డు తొలగించే పనిలో ఉంటాను. సారీ... నిన్ను కష్టపెట్టక తప్పడం లేదు' అంటుంది.

మరోవైపు కార్తీక్ దగ్గరకు టిఫిన్ తీసుకుని దీప, పిల్లలు శౌర్య, హిమ వెళతారు. వాళ్ళు టిఫిన్ తినిపిస్తామని బతిమాలడంతో రత్నసీత సెల్ డోర్ ఓపెన్ చేస్తుంది. అదే సమయంలో ఏసీపీ రోషిణి వస్తుంది. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచమని రత్నసీతతో కోపంగా అంటుంది. ఆమెను పిల్లలు గుర్రుగా చూస్తారు. అదొక ఎమోషనల్ సీన్.

సరిగ్గా స్టేషన్ లో ఉన్నప్పుడు భాగ్యం నుండి దీపకు ఫోన్ వస్తుంది. కార్తీక్ పేరు మీద పూజ చేయించడానికి గుడికి వెళ్తున్నట్టు చెబుతుంది. తాను కూడా వస్తానని దీప అంటుంది. ఆ మాటలు విన్న రత్నసీత, మోనితకు మేటర్ చేరవేస్తుంది.

ముఖం అంతా పసుపు రాసుకుని, ఎర్రచీర కట్టుకుని సోది చెప్పే మహిళలా ముస్తాబై గన్ తీసుకుని బయలుదేరుతుంది. గుడికి క్యాబ్ బుక్ చేసుకుంటుంది. తన దగ్గర క్యాష్ లేదని, అకౌంట్ కి ట్రాన్స్‌ఫ‌ర్‌ చేస్తానని క్యాబ్ డ్రైవర్ తో అంటుంది. మోనిత మాట్లాడిన ఇంగ్లీష్ చూసి ఆమెను ఆర్టిస్ట్ అనుకుంటాడత‌ను. 'మేడమ్ మీరు ఆర్టిస్టా?' అని అడుగుతాడు. అవునని ఆన్సర్ ఇస్తుంది. 'మేడమ్ ఇప్పుడు మీరు ఏ స్టోరీకి ఈ గెటప్ వేసుకున్నారు?' అని అడిగితే... 'ఓ దీపం ఆరిపోయింది' అని చెబుతుంది. దీప ప్రాణం తియ్యడానికి అని ఆడియన్స్ కి ఇన్ డైరెక్టుగా చెప్పింది. ఆ గుడి దగ్గర ఏం జరిగిందో తదుపరి ఎపిసోడ్ కోసం ఉగ్గ‌బ‌ట్టేలా చేసింది ఈ ఎపిసోడ్‌.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.