English | Telugu

Karthika Deepam 2 :దీపని అందరికీ పరిచయం చేయాలనుకుంటున్న కార్తీక్.. పారిజాతం ప్లాన్ ఫెయిల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -192 లో..... దీపని చూసి కార్తీక్ ఫ్రెండ్స్ పనిమనిషి అనుకుంటారు. తను పనిమనిషి కాదు నా భార్య దీప అంటూ దీప భుజంపై కార్తీక్ చెయ్ వేస్తాడు. తను నా కూతురు శౌర్య.. ఇది నా కుటుంబమని కార్తీక్ అనగానే.. వాళ్ళు షాక్ అవుతారు. నీకు పెళ్లి ఎప్పుడైందంటూ అడుగుతారు.. అదో పెద్ద కథ అని కార్తీక్ అనగానే.. కానీ తనను చుస్తే అలా లేదని అంటారు. మరి ఎలా ఉంది పల్లెటూర్ లాగా ఉందా కానీ తన గురించి తెలిస్తే మీరు ఇలా మాట్లాడరని దీప గురించి గొప్పగా చెప్తాడు కార్తీక్. వాళ్ళు సారీ చెప్పి వీలైతే భోజనానికి రండి అని చెప్పి వెళ్ళిపోతారు.

మరొకవైపు జ్యోత్స్నకి ప్లాన్ చెప్తుంది పారిజాతం. మీ తాత దగ్గరికి వెళ్లి.. కాళ్ళు పట్టుకొని సారీ చెప్పు.. కార్తీక్ ని తప్ప ఎవరిని చేసుకునని సింపథీ వచ్చేలా మాట్లాడమని పారిజాతం చెప్తుంది. దానికి జ్యోత్స్న సరే అంటుంది. మరొకవైపు కాంచన, దీప, అనసూయ మాట్లాడుకుంటుంటే అప్పుడే కార్తీక్ వస్తాడు. నేను మీ భార్య స్థానానికి పనికి రానని దీప అంటుంది. ఎవరేం అనుకున్నా నాకు అవసరం లేదు. అందరికి తెలిస్తే ఏమవుతుందోనని భయపడుతున్నావ్ కదా.. ఇక అందరికి తెలిసేలా చేస్తాను. నా భార్య గురించి కూతురు గురించి అని కార్తీక్ అంటాడు.ఆ తర్వాత నేను నాలాగే ఉంటానని దీప అంటుంది.

ఆ తర్వాత శివన్నారాయణ‌ దగ్గరికి జ్యోత్స్న వచ్చి.. కాళ్ళు పట్టుకొని సారీ అడుగుతుంది. నువ్వు నాకు శత్రువు కాదు.. ఈ ఆస్తులకి వారసురాలివి.. నువ్వు చెప్పినట్టు వినాలని శివన్నారాయణ‌ అనగానే వింటానని జ్యోత్స్న అంటుంది. అయితే పెళ్లి చేసుకోమని శివన్నారాయణ అంటాడు. నేను బావని తప్ప ఎవరిని చేసుకోనంటూ జ్యోష్న కోపంగా మాట్లాడుతుంది. నేనేం చెప్పి పంపించాను ఇదేం చేస్తుందని పారిజాతం అనుకుంటుంది. ఆ తర్వాత దాస్ ఇంటికి పారిజాతం వస్తుంది. పారిజాతం అందరి గురించి తప్పుగా మాట్లాడుతుంటే.. కాశీ, స్వప్న ఇద్దరు తనపై కోప్పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.