English | Telugu

Karthika Deepam 2 : కార్తీక్ కోసం వ్రతం చీరలో దీప.. అన్నీ మంచి శకునాలే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -189 లో... కార్తీక్ దగ్గరికి దీప వచ్చి.. మీ పక్కన కూర్చొని వ్రతం చెయ్యలేను బాబు.. మీరే ఎలాగైనా ఆపండని అంటుంది. ఇప్పుడు భర్తగా సమాధానం చెప్పాలా, శ్రేయోభిలాషిలాగా సమాధానం చెప్పాలా అని కార్తీక్ అంటాడు. శ్రేయోభిలాషి అనుకునే వచ్చానని దీప అంటుంది. సాయం చెయ్యాలంటే కాస్త కాలం వెనక్కి వెళ్ళి మాట్లాడుకుందాం.. గతంలో జరిగిన సంఘటనలు దీపకి చెప్తాడు. శౌర్యకి నువ్వు, నేను తప్ప ఎవరు లేరు.. ఏం చేసినా అది శౌర్య కోసమే అని అంటాడు.

అపుడే శౌర్య వచ్చి నాకు ఈ డ్రెస్ ఎలా ఉందని అడుగుతుంది. బాగుంది.. బుట్ట బొమ్మలాగా అని కార్తీక్ అంటాడు. అప్పుడే కాంచన వచ్చి.. మీ అమ్మని అడిగావా అంటుంది.‌ మా నాన్న చెప్తే అమ్మ చెప్పినట్లే ఇద్దరు ఒక్కటే అని శౌర్య అనగానే.. అవునని కాంచన అంటుంది. ఆ తర్వాత నీ కూతురు కి ఏది సంతోషమో అదే చెయ్ నేను ఏం అనను.. మా అమ్మకి మాటిచ్చావ్.. ఇంత చెప్పిన నీ ఇష్టం నీ సమాధానం చెప్పనవసరం లేదు.. వ్రతం చీరలో వస్తే పూజ జరుగుతుంది. లేదంటే పూజ ఆపేస్తానని కార్తీక్ బయట వెయిట్ చేస్తుంటాడు. ఆ తర్వాత కాంచన అనసూయ ఇద్దరు బయట వెయిట్ చేస్తుంటారు. కార్తీక్ దీప కోసం టెన్షన్ గా వెయిట్ చేస్తుంటాడు. అప్పుడే దీప వ్రతం చీరలో రావడం చూసి.. కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అనసూయ, కాంచన ఇద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత అందరు కలిసి గుడికి బయలుదేర్తారు.

మరొకవైపు దీప, కార్తీక్ లు వ్రతం చేస్తున్న విషయం జ్యోత్స్నకి పారిజాతం చెప్పగానే.. తను ఆవేశంగా బయలుదేర్తుంది. పారిజాతాన్ని పక్కకు తోసేసీ వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుందంటూ సుమిత్ర వాళ్ళు అడుగుతారు. వ్రతం గురించి పారిజాతం చెప్పగానే అందరు గుడికి బయల్దేర్తారు. ఆ తర్వాత గుడికి స్వప్న, కాశీ, దాస్ లు వస్తారు. కార్తీక్, దీప లు పూజ మొదలుపెడ్తారు. ఆయన వచ్చినట్టున్నాడని కాంచన అంటుంది. కానీ వచ్చింది జ్యోత్స్న.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.