Read more!

English | Telugu

ఆ తప్పు నేను చేయలేదు నన్ను నమ్ము.. నమ్మనని తెగేసి చెప్పిన దీప!


ఏం జరిగింది.. అసలేం జరుగుతుంది.. నాకు తెలియాలి అన్నట్టుగా మారిపోయింది కార్తీకదీపం2 లోని నిన్నటి ఎపిసోడ్ చూసిన ప్రేక్షకుల‌ మదిలో ఒకటే ఆలోచన..  అసలేం జరిగిందని అనుకుంటున్నారు. దీపకి పెళ్ళి అయిందా?  దీప పాప శౌర్య అయితే నాన్న ఎవరు? ఇలాంటి ప్రశ్నలతో ఆసక్తిగా చూస్తున్నారు.

శౌర్య పాప కోసం దీప ముత్యాలమ్మ జాతరలో పెట్టిన సైకిల్ రేసులో పాల్గొంటుంది. అయితే రేసులో గెలిచిన వారికి ఒక్కో ప్రైజ్ చూసి.. అందులో మూడవ బహుమతిగా సైకిల్ ఇస్తామని చెప్పడంతో దీప కావాలనే థర్డ్ వస్తుంది. దాంతో దీపక్కకి సైకిల్ బహుమతి లభిస్తుంది. అయితే ఈ బహుమతి ప్రధానం చెయ్యడానికి ఎవరో కాదు.. విదేశంలో బిజినెస్ చేసి ఇండియాలో కూడా కొత్త కంపెనీ పెట్టాలని పేదవారిని ఆదుకోవాలని వచ్చిన కార్తిక్. ఇక బహుమతి ప్రధానోత్సవంలో దీపక్క అని పిలవగానే.. కార్తిక్ ని దీప, దీపను కార్తిక్ ఒకరినొకరు చూసుకుంటారు. ఇక దీప అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇక శౌర్య పాప కోసం సైకిల్ తీసుకోవడానికి స్టేజ్ మీదకి వస్తుంది. కార్తిక్ అలాగే దీపని చూస్తూ ఉండిపోతాడు. దాంతో దీప సైకిల్ ఇవ్వమని సైగ చేస్తుంది. సైకిల్ తీసి దీపకి ఇస్తూ.. ఆ తప్పు నేను చేయలేదు నన్ను నమ్మండి అని కార్తిక్ అంటాడు. నేను నమ్మను, నన్ను నమ్మించలేరు బాబు అని దీప చెప్పేసి వచ్చేస్తుంది.  ఇక అందరు వెళ్ళిపోయాక దీపని వెతుక్కుంటు కార్ తీసుకొని కార్తిక్ ఒక్కడే గల్లీ గల్లీ తిరుగుతుంటాడు. వెతుకుతాను. దీపతో మాట్లాడే వెళతాను.. తను నన్ను క్షమిస్తేనే గానీ నేను మనశ్శాంతిగా ఉండలేనని కార్తిక్ అనుకుంటూ కార్ లో కార్తిక్ వెళ్తుంటాడు.

మరోవైపు కార్తిక్ మరదలు జ్యోత్స్న మిస్ హైదరాబాద్ గా గెలిచి ఇంటికొస్తుంది. కార్తిక్ వాళ్ళ నాన్న , అమ్మ కంగ్రాట్స్ అంటు చెప్పిన పట్టించుకోనట్టు ఉంటుంది. ఇక ఇంట్లోకొచ్చాక జ్యోత్స్న వాళ్ళ అమ్మ ఎందుకని మావయ్య, అత్యమ్మలని తీసిపారేసినట్టు బిహేవ్ చేస్తున్నావని అడుగగా‌‌.. నాకు కోపం వచ్చింది.. వాళ్ళు తప్పు చేశారు.. నేను మాట్లాడనని జ్యోత్స్న అంటుంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఏంటని అనగా.. బావ ఎక్కడ ? మీ ముద్దుల కొడుకు ఎక్కడ?  అని అడుగుతుంది‌. లండన్ లో బిజినెస్ చాలదన్నట్టు ఇప్పుడు ఇండియాలో కూడా బిజినెస్ పెట్టి పేదవాళ్ళని ఆదుకోవాలని ఊర్ల మీద పడ్డాడు.. కానీ తన మరదలికి ఒక్క మెసెజ్  చేయడానికి ఖాళీ ఉండదని తన బాధ చెప్పుకుంటుంది జ్యోత్స్న. ఇక  వాళ్ళ తాత శివనారాయాణ తనకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు‌ కానీ తను అలిగి వెళ్ళిపోతుంది. మరోవైపు సైకిల్ తో పాటు శౌర్య ఇంటికొచ్చి కుబేరుడి వాళ్ళ అక్కకి చూపిస్తుంది. ఏంటిది ? ఎక్కడిది ? కొట్టుకొచ్చారా అని తను అడుగగా.. జాతరలో పెట్టిన సైకిల్ రేసులో మూడవ బహుమతి లభించిందని శౌర్య అంటుంది. మీకు ఇది రావడమే ఎక్కువ అని కుబేరుడి వాళ్ళ అక్క అనగా.. దీప, శౌర్య బాధపడతారు‌. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.