English | Telugu

మోనితను చూసిన దీప... పోలీసులకు ఎలా పట్టిస్తుంది?

మోనిత మరణించలేదన్న నిజం దీపకు తెలిసింది. తెలియడం మాత్రమే కాదు... దీపను చంపడానికి మోనిత వేసిన ప్లాన్ బెడిసికొట్టడంతో పాటు దీపకు మోనిత రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతుంది. అయితే, అక్కడ నుండి ఎలాగోలా తప్పించుకుంటుంది. మోనిత బతికిఉందన్న నిజాన్ని మామగారు ఆనందరావు అండ్ ఫ్యామిలీకి, జైలులో ఉన్న భర్త కార్తీక్ కు చెబుతుంది. అయితే, నిజం తెలియడం వేరు. దాన్ని నిరూపించడం వేరు.

మోనిత మరణించలేదని, కార్తీక్ ను జైలుకు పంపడం కోసం నాటకం ఆడిందని పోలీసుల ముందు దీప ఎలా నిరూపిస్తుంది? మోనితను పట్టించడానికి అందివచ్చిన అవకాశాన్ని కార్తీక్-దీప దంపతులు గుర్తిస్తారా? అన్నది రేపటి ఎపిసోడ్‌లో తెలుస్తుంది. మరి, ఇవాళ్టి ఎపిసోడ్‌లో ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే...

ఒంటరిగా గుడికి వచ్చిన దీపను గన్‌తో షూట్ చేసే సమయంలో తుమ్ము రావడం, సరిగ్గా అదే సమయంలో అక్కడికి దుర్గ రావడంతో సోదమ్మ వేషంలో ఉన్న మోనిత తప్పించుకున్న సంగతి తెలిసిందే. అయితే, మోనితను దీప చూస్తుంది. జరిగినదాన్ని తలుచుకుంటూ మోనిత బాధపడుతుంది. తన చేతికి మట్టి అంటుకోకుండా దీప అడ్డు తొలగించి కార్తీక్ ను తనవాడిని చేసుకోవడం ఎలా? అని ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే... మరోవైపు తండ్రి ఎందుకు జైలుకు వెళ్ళాడో తెలుసుకోవాలని పిల్లలు దీపను ప్రశ్నిస్తారు. దాంతో వాళ్లపై దీప కోప్పడుతుంది.

కట్ చేస్తే... దీపను చంపాక‌ ఎక్కడో చేసిన పొరబాటు సాక్ష్యంగా మారితే కార్తీక్ జైలు నుండి బయటకు వచ్చినా, తాను జైలులోకి వెళ్లాల్సి వస్తుందన్న నిజాన్ని మోనిత గ్రహిస్తుంది. దాంతో ప్లాన్ బి అమలు చేయాలని అనుకుంటుంది. రత్నసీతకు ఫోన్ చేసి చెబుతుంది. 'రిస్క్ ఏమో మేడమ్' అని రత్నసీత ప్రశ్నిస్తే 'కార్తీక్ కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాన'ని అంటుంది.

జైలులో మోనిత ప్లాన్ ను రత్నసీత అమలు చేయడం మొదలు పెడుతుంది. 'డాక్టర్ సార్.. మీకు బయట టీ చెప్పి వెళ్తాను. మూగమ్మాయి వచ్చి మీ టీ ఇస్తుంది' అని వెళుతుంది. మూగమ్మాయి వేషంలో జైలులోకి మోనిత వస్తుంది. ఆ సమయంలో కార్తీక్, దీప మాట్లాడుకుంటూ ఉంటారు. మోనితను చూశానని దీప చెబుతుంది. కార్తీక్ మాత్రం తనను విడిపించాలనే ధ్యాసలో అలా అంటున్నావని అంటాడు. 'లేదు డాక్టర్ బాబు. మోనిత రివాల్వర్ తో వచ్చింది. దాన్ని పట్టుకుని మిమ్మల్ని బయటకు తీసుకొస్తా' అంటుంది దీప.

అదే సమయంలో కార్తీక్ చేతిని తాకుతూ టీ అందించి మోనిత వెళుతుంది. ఈ సన్నివేశం చాలా ఉత్కంఠగా ఉంది. అక్కడ మోనిత స్పర్శను కార్తీక్ గమనిస్తాడు. దీపతో మాట్లాడుతూ ఉండటం వల్ల పెద్దగా పట్టించుకోడు. 'ఆ స్పర్శ మోనితదే' అనుకుంటాడు. అయితే, మోనిత బయటకు వెళ్లే సమయంలో కాలికి ఏదో తగలడంతో 'హా' అంటుంది. మూగమ్మాయి ఎలా అరిచింది? అనేది కార్తీక్, దీప గమనిస్తే ఆమెను పట్టించవచ్చు. కళ్ళముందుకు వచ్చిన మోనితను పెట్టుకుంటారా? లేదా? అన్నది రేపటి ఎపిసోడ్‌లో చూడాలి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.