English | Telugu

మహిళల మనసు గెలుచుకున్న జూనియ‌ర్ ఎన్టీఆర్!

నందమూరి కుటుంబ సంస్కారం, మహిళలకు ఎంత గౌరవం ఇస్తారనేది 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమంతో మరోసారి ప్రజలకు తెలిసింది. ఒక్క అక్షరం, బుల్లితెర కార్యక్రమం పేరులో ఒక్క అక్షరం మార్పు చెయ్యడంతో యంగ్ టైగర్ జూనియ‌ర్‌ ఎన్టీఆర్ మహిళల మనసు గెలుచుకున్నారు. ఆయన నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

జెమినీ టీవీలో 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమం ఆగస్టు 22న మొదలైంది. మొదటి ఎపిసోడ్‌కి రామ్ చరణ్ గెస్ట్ కింద వచ్చారు. అదే రోజు చిరంజీవి పుట్టినరోజు కూడా కావడంతో తండ్రితో పాటు 'ఆచార్య' సినిమాకు సంబంధించిన విశేషాలు రామ్ చరణ్ వెల్లడించారు. అయితే, గతంలో 'స్టార్ మా'లో ఈ కార్యక్రమం ప్రసారమైనప్పుడు 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అని ఉండేది. కార్యక్రమానికి వచ్చే అతిథులను ఏకవచనంతో సంబోధించడం తనకు నచ్చలేదని, అందుకని 'కోటీశ్వరుడు'ను 'కోటీశ్వరులు' కింద మార్చమని చెప్పానని తార‌క్‌ అన్నారు.

టైటిల్ మార్పు గురించి జూనియ‌ర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ "షోకు వచ్చేవాళ్లను 'డు' అంటూ ఏకవచనంతో సంభోదించడం నాకు ఇష్టం లేదు. మహిళలు కూడా షోకు వస్తారు కాబట్టి 'ఎవరు మీలో కోటీశ్వరులు' అని మార్చాము" అని చెప్పారు. ఈ మాట మహిళల మనసులను తాకింది. తార‌క్‌ మీద వారంతా ప్రశంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.