English | Telugu

గుప్పెడంత మనసు సీరియల్ టీంని మిస్సవుతున్నాం

గుప్పెడంత మనసు సీరియల్ ఓ రేంజ్ లో ఆడియన్స్ ని అందులోనూ లేడీ ఫాన్స్ ని ఆకట్టుకుంది. రిషి, వసుధారా, శైలేంద్ర, ధరణి జోడీలుగా నటించారు. ఇక ఈ సీరియల్ ఐపోయాక ఆడియన్స్ అంతా కూడా కొంచెం డల్ ఐనట్టే కనిపిస్తున్నారు. రిషి సర్ ఎప్పుడొస్తారు అని అడుగుతున్నారు. ఐతే ఇప్పుడు రిషి సర్ ఒక మూవీలో నటిస్తున్నాడు. అలాగే జగతి మేడం కూడా మూవీస్ లో నటిస్తోంది. ఇక ధరణి, సురేష్ బాబు, సాయి కిరణ్ వేరే సీరియల్స్ లో నటిస్తున్నారు. ఇక వసుధారా ప్రస్తుతానికి రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది.

తాజాగా శైలేంద్ర అలియాస్ సురేష్ బాబు "ఏటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఒంటరయ్యింది వయసు" అనే సాంగ్ కి రీల్ చేసి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. ఇక నెటిజన్స్ ఐతే "ధరణి దగ్గరకు వెళ్ళిపోయుంటుంది మనసు...మిమ్మల్నందరినీ మిస్ అవుతున్నాం. మీరు గుప్పెడంత మనసు పార్టీ 2 తో వెంటనే వచ్చేయండి..సురేష్ బాబు గారు గుప్పెడంత మనసులో మీ యాక్టింగ్ సూపర్ సార్ సీరియల్ అయిపోయాక తిరిగి సూర్యకాంతంలో కనబడడం చాలా సంతోషంగా ఉంది.." అంటూ మెసేజెస్ పెడుతున్నారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.