English | Telugu

Gangavva Elimination: గంగవ్వ ఎలిమినేషన్.. హౌస్ మేట్స్ అంతా ఎమోషనల్!

బిగ్ బాస్ సీజన్-8 లో గత వారం నుండి జరుగుతున్న మెగా ఛీఫ్ టాస్క్ ముగిసి అందులో ప్రేరణ గెలిచింది. నాలుగైదు సార్లు మెగా చీఫ్ కంటెండర్ అయ్యింది కానీ.. చివరి క్షణంలో ఆమె మెగా చీఫ్ కాకుండా అడ్డుకుంటూ ఉన్నారు. దాంతో ఆమె మెగా చీఫ్ అయితే బాగుండు అని అందరికీ అనిపించింది. అయితే పదో వారంలో ఎట్టకేలకు ఆమె మెగా చీఫ్ అయ్యింది.

ఇక పదో వారం వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఎవరి మీద సీరియస్ అవ్వలేదు. ఎందుకో ఏమో ఈ వారం కాస్త సప్పగా సాగింది. ఇక హౌస్ మేట్స్ అందరిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి హౌస్ లో ఎవరు వరెస్ట్ అనుకుంటున్నారో చెప్పమని నాగార్జున అడిగారు. ఇక ఈ తతంగం అంతా అయ్యాక చివరగా గంగవ్వని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పమని అడిగాడు నాగార్జున. కాళ్ళు, చేతులు చల్లగా అవుతున్నాయని, రోజుకు ఒక్కపూటే తినడం అవుతుందంటూ తన సమస్యలు చెప్పుకుంది గంగవ్వ.‌ ఇక ఇంట్లో ఉండవ అని అడుగగా లేదని గంగవ్వ చెప్పింది. దాంతో తనని మెయిన్ గేట్ నుండి బయటకు వచ్చేయమన్నాడు నాగార్జున. ఇక హౌస్ మేట్స్ అంతా కన్నీటి పర్యంతం అయ్యారు.

ఈవారం నామినేషన్స్‌లో లేని గంగవ్వని బిగ్ బాస్ హౌస్ నుంచి అనారోగ్య కారణాలతో ఇంటికి పంపిచేశారు. ఫ్యామిలీ వీక్ వరకూ మాత్రమే హౌస్‌లో ఉంటానని ముందే చెప్పింది గంగవ్వ. ఎనిమిదవ వారంలో ఆమెకు అనారోగ్య సమస్యలు తలెత్తగా డాక్టర్లు కూడా పరీక్షించారు. దాంతో తొమ్మిదవ వారంలో బయటకు పంపిస్తారని అనుకున్నారు. కానీ ఈవారంలో గంగవ్వ కాస్త మెరుగ్గా ఆడింది. ఫ్యామిలీ వీక్ వరకూ పక్కాగా ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే అనూహ్య రీతిలో గంగవ్వని శనివారం ఎపిసోడ్‌లోనే ఇంటికి పంపించేశారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.