English | Telugu

Eto Vellipoyindhi Manasu : డిటెక్టివ్ సీతాకాంత్ తో ఆ నిజాన్ని చెప్పగలడా.. భార్య కోసం భర్త అలా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -248 లో.....డిటెక్టివ్ తప్పించుకున్న విషయం నందినికి అభి ఫోన్ చేసి చెప్పగానే.. తనపై కోప్పడుతుంది. వాడిని నేను చూసుకుంటన్ అని కోపంగా ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత శ్రీవల్లి, శ్రీలత ఇద్దరు మాట్లాడకుంటుంటే అప్పుడే రామలక్ష్మి అటిట్యూడ్ గా నడిచి వస్తుంటుంది. ఏంటి ఇంకా ఇది నీ సొంత ఇల్లు అనుకొని ఫీల్ అవుతున్నావా అని శ్రీలత అనగానే.. సీతాకాంత్ బావ గారు అన్న మాటలు గుర్తు చేయండి అత్తయ్య అని శ్రీవల్లి అంటుంది.

సీతా మెడ పట్టుకొని బయటకి గెంటేసే వరకు చూస్తున్నావా అని శ్రీలత అనగానే.. మీరు ఎందుకు అంత ఉహించుకుంటున్నారని రామలక్ష్మి అంటుంది. అప్పుడే సిరి, పెద్దాయన వచ్చి.. ఎందుకు అలా మాట్లాడతున్నావ్ శ్రీవల్లి వదిన అని సిరి అంటుంది. సీతా నే చెప్పాడు కదా అని శ్రీలత అంటుంది. నేను ఇక్కడే తనతోనే ఉండాలని తన కోరిక అని రామలక్ష్మి అంటుంది. అలా సీతా చెప్పలేదు కదా అని శ్రీలత అంటుంది. మా ఆయనకి ఇంకా నాపై ప్రేమ ఉందని నిరూపించాలా అని రామలక్ష్మి అనగానే.. నువ్వు నిరూపించాలంటే ఉన్నట్టు ఉండి వర్షం పడాలి అది జరిగే పని కాదని శ్రీవల్లి అంటుంది.. ఆ తర్వాత సిరి కొన్ని పువ్వులు తీసుకొని రా అని రామలక్ష్మి పంపిస్తుంది. మరొక వైపు డిటెక్టివ్ తప్పంచుకొని అభి వెనకాల ఉండి ఎవరు ఇదంతా చేయిస్తున్నారో చెప్పాలని సీతాకి ఫోన్ చెయ్యాలని అనుకుంటాడు కానీ తన ఫోన్ స్విచాఫ్ అవుతుంది.‌ఇప్పుడు ఆఫీస్ కి వెళ్తానని బయలుదేర్తాడు. మరొక వైపు ఆ డిటెక్టివ్ ని పట్టుకొని డబ్బు ఆశ చూపించి నిజం చెప్పకుండా ఆపాలని నందిని అనుకుంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి పూజ చేస్తుంది. మా ఆయన వచ్చారా అని రామలక్ష్మి అనగానే.. వస్తే నేను చెప్తానని పెద్దాయన అంటాడు.

ఆ తర్వాత సీతాకాంత్ రావడం చూసిన రామలక్ష్మి మొక్కుకుంటూ.. మా ఆయనతో నేను ఉండాలని అంటే వర్షము కురిసేల చెయ్ అని అంటుంది. అది విని సీతాకాంత్ పక్కకి వెళ్తాడు. తన వెనకాల పెద్దాయన, సిరి వచ్చి రామలక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలా అని అడుగుతారు. నాకు ఇక్కడే ఉండాలని ఉంది కానీ ఇప్పుడు వర్షం ఎలా పడుతుందని అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ పెద్దాయన కలిసి వాటర్ ని స్ప్రే చేస్తారు. దాంతో రామలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.