English | Telugu

భార్యకి ఐస్ క్రీమ్ తినిపించిన భర్త.. అది చూసి కుళ్ళుకున్న సవతి తల్లి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -242 లో.....రామలక్ష్మి, సీతాకాంత్ లు వస్తుంటే కార్ ఆగిపోతుంది. సీతాకాంత్ కార్ దిగి చెక్ చేస్తాడు. లాభం లేదు ఇక మెకానిక్ ని పిలవాలని అంటాడు. నేను చూస్తానని రామలక్ష్మి అనగానే నాకంటే ఎక్కువ తెలుసా అంటాడు. అపుడే స్కూటీ పై ఇద్దరు కపుల్స్ వెళ్తుంటారు. వాళ్ళని చూసి రామలక్ష్మి మనం బైక్ పై వెళదామని అంటుంది. దాంతో అటుగా వెళ్తున్న స్కూటీని ఆపి స్కూటీ ని కొంటాడు.

ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తారు. రామాలక్ష్మి స్కూటీ డ్రైవ్ చేస్తుంటుంది. కాసేపటికి స్కూటీ కూడా ఆగిపోతుంది. దాంతో సీతాకాంత్ ని స్కూటీపై ఎక్కించుకుని రామలక్ష్మి నడుచుకుంటూ వెళ్తుంది. దాంతో వీళ్ళే వారందరు సీతాకాంత్ ని చూసి.. నువ్వేం మనిషివి.. భార్య అలా కష్టపడుతుంటే మంచిగా కూర్చొని ఉన్నావని అంటుంటే.. రామలక్ష్మిని స్కూటీపై ఎక్కించుకొని తోసుకుంటూ వెళ్తాడు సీతాకాంత్. ఆ తర్వాత రామలక్ష్మి ఆగమని చెప్పి బండి ని రిక్వెస్ట్ చెయ్యగానే.. బండి స్టార్ట్ అవుతుంది. దాంతో ఇద్దరు వెళ్లిపోతారు. మరొకవైపు అభిని కలవడానికి నందిని వస్తుంది. నువ్వేం చేస్తున్నావంటూ కోప్పడుతుంది. నేను రామలక్ష్మి కంటే ముందు సీతాకాంత్ ని తొలగించాలని మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత అభికి నందిని ఒక ప్లాన్ చెప్తుంది. దానికి అభి సరే అంటాడు.

మరొకవైపు వాళ్ళు ఇంకా రావడం లేదు. మనం విడగొట్టాలని అనుకుంటున్నాం కానీ వాళ్ళు వెంటనే కలిసిపోతున్నారని శ్రీవల్లి శ్రీలతతో శ్రీవల్లి అంటుంది. అప్పుడే రామలక్ష్మి, సీతాకాంత్ లు స్కూటీ పై వస్తారు. సీతాకంత్, రామలక్ష్మికి ఐస్క్రీమ్ తినిపిస్తూ వస్తాడు. దాన్ని చూసి శ్రీలత, శ్రీవల్లి చూసి షాక్ అవుతారు. పెద్దాయన, సిరి కూడా షాక్ అవుతారు. మీరు అటే ఎటైనా వారం రోజులు వెళ్లకుండా వచ్చారని పెద్దాయన సరదాగా అంటాడు. దాంతో సీతాకాంత్ సిగ్గుపడుతూ రామలక్ష్మికి ఐస్క్రీమ్ తినిపిస్తూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.