English | Telugu

దూరదర్శన్ నటీమణులతో ఒక సీరియల్ వస్తే బాగుండు

ఒకప్పుడు దూరదర్శన్ రాజ్యమేలే రోజుల్లో వచ్చే కొన్ని సీరియల్స్ ఐనా కానీ వాటి కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసేవారు ఆడియన్స్. అలాంటి దూరదర్శన్ ఛానల్ వచ్చిన రుతురాగాలు సూపర్ డూపర్ హిట్ కొట్టింది. అలాగే డామిట్..కథ అడ్డం తిరిగింది. అలాగే భమిడిపాటి రామగోపాళం కథలు, వేయి పడగలు, ఆనందో బ్రహ్మ ఇలా చెప్పుకుంటూ పొతే బోలెడు. ఇక ఋతురాగాలు సీరియల్ లో నటించిన శృతి, ప్రీతి నిగమ్ అలాగే డామిట్ కథ అడ్డం తిరిగింది సీరియల్ లో నటించిన జ్యోతి రెడ్డి వీరంతా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు గ్రీన్ నటీమణులుగా చెలామణి అవుతూనే ఉన్నారు.

ఇప్పటికీ సీరియల్స్ చేస్తూ మూవీస్ లో నటిస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా రీల్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్లంతా కలిసి ఒక వీడియో చేసి ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు. "ఆనాటి ఆ స్నేహమానంద గీతం" అనే పాటకు వాళ్ళు స్టెప్స్ వేశారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ కూడా కామెంట్స్ చేశారు. "మీరు మళ్ళీ మంచి సీరియల్స్ తో కం బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. చేసిన నెగటివ్ రోల్స్ కాకుండా మంచి కామెడీ రోల్ చేయాలని యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి మంచి మంచి వంటలు చేయాలని కోరుకుంటున్నా" అంటూ పోస్ట్ పెట్టారు. "ఇక వీళ్లంతా కూడా మంచి అవకాశం వస్తే అందరం కలిసి నటించాలని ఉంది" అని రిప్లై ఇచ్చారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.