English | Telugu

షణ్ముఖ్‌తో దీప్తి బ్రేకప్..?

డబ్ స్మాష్ వీడియోలతో ఫేమస్ అయిన దీప్తి సునైనా.. బిగ్ బాస్ షోలో పాల్గొని తన ఫాలోయింగ్ పెంచుకుంది. ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు, స్పెషల్ ఆల్బమ్స్ అంటూ బిజీగా గడుపుతోంది. అయితే చాలాకాలంగా దీప్తి సునైనా.. యుట్యూబ‌ర్ షణ్ముఖ్ తో ప్రేమలో ఉందంటూ వార్తలొస్తున్నాయి. ఈ వార్తలను వీరిద్దరూ ఎప్పుడూ ఖండించలేదు. అలా అని ప్రేమలో ఉన్నట్లు కూడా ఎప్పుడూ బ‌హిర్గ‌తం చేయ‌లేదు.

కానీ వీరిద్దరి పోస్ట్ లు, సన్నిహితంగా మెలిగే తీరు చూస్తుంటే ప్రేమలో ఉన్నారనే సందేహాలు కలగక మానవు. అయితే ఇప్పుడు దీప్తి సునైనా చేసిన ఓ పోస్ట్ మాత్రం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మామూలుగానే దీప్తి సునైనా ఫుడ్ లవర్. ఆమెకి తినడమంటే చాలా ఇష్టం. ఎక్కువగా వర్కవుట్లు చేసేది కూడా తినడానికే అని చెబుతుంటుంది.

తాజాగా ఈమె ఓ మీమ్ షేర్ చేస్తూ కామెంట్ పెట్టింది. అందరూ ప్రేమలో పడుతున్నారు కానీ తను మాత్రం ఈ తినడం గోలలోనే ఉండిపోయాననే అర్థం వచ్చేలా ఓ మీమ్‌ను షేర్ చేసింది. ఈ పోస్ట్ ద్వారా తను ప్రేమలో లేననే విషయాన్ని చెప్పకనే చెబుతోంది దీప్తి సునైనా. దీంతో దీప్తికి షణ్ముఖ్‌తో బ్రేకప్ జరిగిందా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. రీసెంట్‌గా అభిమానులతో ముచ్చటించిన దీప్తి.. ఐదేళ్ల తరువాత పెళ్లి చేసుకుంటానని చెప్పారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.