English | Telugu

`దేవ‌త‌`: ఆదిత్య‌కు షాకిచ్చిన‌ రాధ‌

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ దేవ‌త‌. శోభ‌న్ బాబు, శ్రీ‌దేవి, జ‌య‌ప్ర‌ద ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన `దేవ‌త‌` కాన్సెప్ట్‌నే తీసుక‌ని దానికి నాట‌కీయ ప‌రిణామాల్ని ప‌జోడించి కొత్త పంథాలో కాస్త భిన్నంగా కుటుంబ భావోద్వేగాల్ని జోడించి ఈ సీరియ‌ల్‌ని రూపొందించారు. `చంటిగాడు` ఫేమ్ సుహాసిని, అర్జున్ అంబ‌టి, వైష్ణ‌వీ రామిరెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్రేమించిన వాడిని అక్క కోసం త్యాగం చేసే ఓ చెల్లెలు క‌థ‌.. చెల్లెలు త్యాగాన్ని తెలుసుకుని త‌న జీవితాన్నే త్యాగం చేసిన ఓ అక్క క‌థ‌గా ఈ సీరియ‌ల్‌ని రూపొందించారు.

గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న దేవ‌త ఈ రోజు 398వ ఎపిసోడ్‌లోకి ప్ర‌వేశించింది. ఈ మంగ‌ళ‌వారం ఎపిసోడ్ ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగబోతోంది. త‌న‌ని వెతుక్కుంటూ వ‌చ్చిన ఆదిత్య‌తో త‌న‌కు పెళ్లైంద‌ని చెబుతుంది రాధ‌. ఈ విష‌యం ఆదిత్యని షాక్‌కు గురిచేస్తుంది. ఇదిలా వుంటే రాధ‌, మాధ‌వ్‌లు క‌లిసి ముడుపు క‌డితే వాల్లు భార్య‌భ‌ర్త‌లేన‌ని లేదంటే కాద‌ని ఆదిత్య‌తో ర‌మ్య అంటుంది. రాధ త‌న కూతురు దేవి కోసం మొక్కు తీర్చ‌డానికి ముడుపు క‌ట్టేందుకు మాధ‌వ్‌, రాధ గుడికి వ‌స్తారు.

త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో మాత్ర‌మే మాధ‌వ్‌తో క‌లిసి ముడుపుక‌ట్టేందుకు రాధ ముందుకు వ‌స్తుంది. ఇద్ద‌రు క‌ల‌సి ముడుపు క‌ట్టేందుకు ముందుకొస్తారు. ఇదే స‌మ‌యంలో మాధ‌వ్‌కు కళ్లు తిర‌గ‌డంతో ముడుపు వ‌దిలేస్తే రాధే క‌ట్టేస్తుంది. కానీ దూరం నుంచి చూస్తున్న ఆదిత్య‌, ర‌మ్య‌ల‌తో పాటు జాన‌కి, రామ్మూర్తిల‌కు మాత్రం రాధ‌, మాధ‌వ్‌లు క‌లిసి ముడుపు క‌డుతున్నాట్టుగా క‌నిపిస్తుంది. అది చూసిన ఆదిత్య ఎలా రియాక్ట్ అయ్యాడు? .. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.