English | Telugu

Brahmamudi : గోల్డ్ బాబుని ఇంప్రెస్ చేయడానికి కోయిలి ప్లాన్.. ఒకే చెప్పిన రంజిత్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ - 870 లో..క్లయింట్ కి ఇవ్వాల్సిన కొటేషన్ సిస్టమ్ లో లేదని సుభాష్ కి శృతి ఫోన్ చేసి చెప్తుంది. దాంతో సుభాష్ టెన్షన్ పడతాడు. ఒకవేళ క్లయింట్ వెళ్ళిపోతే యాభై కోట్ల లాస్ వస్తుందని రాజ్ కి సుభాష్ కాల్ చేసి చెప్తాడు. వెంటనే అక్కడ నుండి బయల్దేరండి అని సుభాష్ చెప్తాడు. అప్పుడే కావ్య వస్తుంది. కావ్యకి విషయం చెప్పి మనం ఇప్పుడు బయల్దేరాలని చెప్తాడు. అవసరం లేదు ఆ కొటేషన్ నా సిస్టమ్ లో సేవ్ చేసి పెట్టానని కావ్య చెప్తుంది. దాంతో రాజ్ రిలాక్స్ అవుతాడు.

ఆ తర్వాత ప్రకాష్ కి కావ్య ఫోన్ చేసి కొటేషన్ తన సిస్టమ్ లో ఉన్న విషయం చెప్తుంది. దాంతో అందరు రిలాక్స్ అవుతారు. రుద్రాణి మాత్రం ప్లాన్ ఫెయిల్ అయిందని డిస్సపాయింట్ అవుతుంది. మరొకవైపు గోల్డ్ బాబూ దగ్గరికి కొయిలి వస్తుంది. ఈ టైమ్ కి పార్టీలో ఉండి ఎంజాయ్ చేసేవాడిని అని గోల్డ్ బాబూ అంటాడు. మీరెందుకు టెన్షన్ పడుతారు. ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తారు. మీకు పార్టీ అరెంజ్ చేస్తానని కోయిలి చెప్తుంది. రంజిత్ దగ్గరికి వెళ్లి అర్జెంట్ గా ఒక లక్ష కావాలి గోల్డ్ బాబుకి పార్టీ కావాలట అని చెప్తుంది. ఇప్పటికే అప్పు చాలా చేసామని రంజిత్ అంటాడు. ఆ గోల్డ్ బాబుని ఇంప్రెస్ చేసి వాడి బంగారం మొత్తం లాగేసుకుందామని కోయిలి అనగానే రంజిత్ సరే అంటాడు.

ఆ తర్వాత రాజ్, కావ్యకి ఇందిరాదేవి, అపర్ణ వీడియో కాల్ చేస్తారు. వాళ్ళ గెటప్ చూసి ఇందిరాదేవి వాళ్ళు నవ్వుకుంటారు. ఎలాగైనా రాహుల్ కి బుద్ధి చెప్పి ఇంటికి తీసుకొని వస్తామని స్వప్నకి కావ్య ధైర్యం చెప్తుంది. మరొకవైపు పార్టీకి అన్నీ రెడీ చేసి కోయిలి ఫ్యాషన్ డ్రెస్ లో వస్తుంది. తనని చూసి రాహుల్ షాక్ అవుతాడు. ఇలాంటి బట్టలు ఎందుకు వేసావని అడుగుతాడు. నీకు ఇలాగే ఇష్టం కదా అని కోయిలి అంటుంది. నేను ఒక్కడే ఉన్నప్పుడు వేసుకోవాలి.. ఇలా అందరున్నప్పుడు కాదని రాహుల్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.