English | Telugu

Brahmamudi : ఒకే బెడ్ పై కోయిలి, గోల్డ్ బాబు.. ముక్కలైన రాహుల్ మనసు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -869 లో.... కోయిలికి కావ్య చుక్కలు చూపిస్తుంది. కోయిలి ఫుడ్ బయట నుండి తెస్తే ఎందుకు తీసుకొని వచ్చావని తిడుతుంది కావ్య. నువ్వు ఇంట్లో వంట చెయ్ అని కావ్య అంటుంది. ఇంట్లో వంట చెయ్యడానికి కోయిలి నానాతంటాలు పడుతుంది. కావ్య దగ్గరుండి మరి కోయిలి చేత పని చేయిస్తుంది. మరొకవైపు రాహుల్ తో రాజ్ మాట్లాడుతాడు. కాసేపట్లో గోల్డ్ బాబూ రాబోతున్నాడని రాహుల్ తో రాజ్ చెప్తాడు.

కోయిలి పనులు చేసి నీరసంగా రాహుల్ దగ్గరికి వస్తుంది. ఏంటి ఈ అవతారం చూడలేకపోతున్నానని రాహుల్ అనగానే దాని ఒరిజినల్ అదే అని కావ్య అంటుంది. లేదు స్నానం చేసే వస్తే అందంగా ఉంటానని కోయిలి అంటుంది. అప్పుడే గోల్డ్ బాబు ఎంట్రీ ఇస్తాడు. తన మెడలో బంగారం చూసి కోయిలి టెంప్ట్ అవుతుంది. ఇక గోల్డ్ బాబు నాకు దుబాయ్ లో బోలెడన్ని బిజినెస్ లున్నాయని.. ఇప్పుడు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వచ్చానని అంటాడు. నా కంపెనీ లో పెట్టండి అని కోయిలి అంటుంది. ఆ తర్వాత గోల్డ్ బాబుకి కోయిలి గది చూపిస్తుంది. గోల్డ్ బాబూ సూట్ కేసు లో గోల్డ్ బిస్కెట్ లు చూసి కోయిలి ఫ్లాట్ అవుతుంది.

మరొకవైపు రాహుల్ కి రుద్రాణి ఫోన్ చెసి కావ్య, రాజ్ అక్కడికి వచ్చారట ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేసాను.. నువ్వేం టెన్షన్ పడకని చెప్తుంది. రాజ్ సిస్టమ్ లో క్లయింట్ కి ఇవ్వాలసిన కొటేషన్ ని రుద్రాణి డిలీట్ చేపిస్తుంది. ఆ తర్వాత శృతి చూసేసరికి ఆ కొటేషన్ ఉండదు. వెంటనే రాజ్ కి ఫోన్ చేస్తే ఫోన్ కలవదు. దాంతో సుభాష్ కి ఫోన్ చేసి విషయం చెప్తుంది. తరువాయి భాగం లో కోయిలి, గోల్డ్ బాబు ఒకే గదిలో బెడ్ పై ఉండడం రాహుల్ చూసి షాక్ అవుతాడు. కోయిలి కేర్ అఫ్ ఫ్లాట్ ఫామ్ అని రాహుల్ కి అసలు విషయాలన్నీ రాజ్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.