English | Telugu

Brahmamudi : బ్రహ్మముడి సీరియల్ లో కీలక మలుపు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -555 లో....సీతారామయ్య కావ్యకి ఫోన్ చేసి.. రాజ్ ఏదో అంటున్నాడు కానీ వాడి మాటలు పట్టించుకోవడం లేదు కానీ నీకు జాగ్రత్త చెప్తున్నా.. ఆ అనామిక గురించి నీకు తెలుసు కదా అని నీ సామర్థ్యం ఏంటో నాకు తెలుసని సీతారామయ్య అనగా.. కావ్య సరే అంటుంది.

ఆ తర్వాత కనకం నేను కూడా వేళంపాటకి వస్తానని అనగానే.. సరేనని కావ్య అంటుంది. మరొకవైపు అసలు వేళంపాట గురించి ఏం తెలియదు ఎలా తెలుసుకోవాలి. ఈ కావ్య ఏం చెయ్యబోతుందన్న డౌట్ తో శృతి ని అడగాలని కాల్ చేస్తాడు. తను తిక్క సమాధానం చెప్తూ ఉంటే.. రాజ్ ఫోన్ కట్ చేస్తాడు. మరుసటిరోజు ఉదయం అపర్ణ హాల్లో కూర్చొని ఉంటుంది. సుభాష్ ఇంకా లేవలేదా అని ఇందిరాదేవి అంటుంది. ఏమో నాకు తెలియదు మీరే వెళ్లి చూడండి అనగానే.. ఇందిరాదేవి వెళ్లేసరికి సుభాష్ జ్వరంతో ఉంటాడు. అది చూసి ఇందిరాదేవి వచ్చి.. భర్త అలా ఉంటే పట్టించుకోవడం లేదని కోప్పడుతుంది.

ఆ తర్వాత కావ్య, కనకం ఇద్దరు వేళంపాటకి వస్తారు. అనామిక వచ్చి కావ్యతో గొడవపడుతుంది. అప్పుడే రాజ్, రుద్రాణి ఇద్దరు కూడా వస్తారు. వేళంపాట మొదలవుతుంది. నేను వేళంపాట పడుతానని కనకం అనగనే.. కావ్య సరే అంటుంది. అనామికకి ఒక అమౌంట్ ఎక్కువనే కనకం పాడుతుంది. చివరగా అనామిక నలభై కోట్లకి పాడుతుంది. ఇక ఆపు అమ్మ అని కనకంతో కావ్య చెప్తుంది. అరవింద్ కంపెనీని అనామిక సొంతం చేసుకుంటుంది. ఆ తర్వాత అందరు బయటకు వస్తారు. అనామిక చూసావా.. నేనే దక్కించుకున్నా అన్నట్లు పొగరుగా మాట్లాడుతుంటే కాసేపు ఆగితే తెలుస్తుందని కావ్య అంటుంది. తరువాయి భాగంలో మావయ్యని క్షమించండి అప్పుడే మీ అబ్బాయి నన్ను క్షమిస్తాడని అపర్ణతో కావ్య అంటుంది. దాంతో సుభాష్ దగ్గరికి అపర్ణ వెళ్లి నన్ను క్షమించండి అని అంటుంది. వీళ్ళు ఒకటి అవ్వడానికి కారణం కావ్య అని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.