English | Telugu
Brahmamudi : వరలక్ష్మి వ్రతం కోసం కొత్త జంట వస్తారా...
Updated : Aug 22, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -494 లో.....కావ్య తను అన్నమాటలు ఎక్కడ ఇంట్లో వాళ్లకు చెప్తుందోనని కావ్యని రాజ్ బయటకు తీసుకొని వస్తాడు. నువ్వు ఏదో సరదాకీ అన్నావనుకున్న కానీ ఇలా చేస్తావనుకోలేదు వెళ్లి అందరికి టిఫిన్ చెయ్ అని చెప్తాడు. అయినా కావ్య వినకుండా ఎందుకు అలా అన్నారు.. మీ ఆస్తులుకి ఆశపడ్డనా అంటు రాజ్ తో వాదిస్తుంది.
మరొకవైపు ఉన్నా డబ్బులతో బట్టలు కొనేసాం.. ఇప్పుడు ఎలా అంటూ అప్పు, కళ్యాణ్ లు ఆలోచిస్తుంటే.. అప్పుడే ఒకతను వచ్చి మీరు షాపింగ్ చేశారు కదా మీకు లక్కీ డ్రాలో అయిదు లక్షలు వచ్చాయని వస్తాడు. నేను ఇప్పుడే షాపింగ్ చేసాను ఇప్పుడే ఎలా వచ్చాయని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత అతని చెవిలో ఉన్న బ్లూ టూత్ కనెక్ట్ తీసుకొని అన్నయ్య ఇదంతా నువ్వే చేసావ్ అని తెలుసు.. లోపలికి రా అంటాడు. రాజ్ లోపలికి వస్తాడు. నువ్వు ఇలా కష్టపడుతుంటే చూడలేకపోతున్నా డబ్బులు ఇస్తే తీసుకోవని రాజ్ అంటాడు. అంటే భార్యని కూడా పోషించుకోలేని అసమర్తుడివి అనుకున్నావా అని కళ్యాణ్ అనగానే.. రాజ్ డిస్సపాయింట్ అవుతాడు. ఆ తర్వాత కావ్య భోజనం చేస్తుంటే.. అపర్ణ వచ్చి మాట్లాడుతుంది. అప్పుడే స్వప్న వచ్చి.. ఈ రోజు మనం హాస్పిటల్ కి వెళ్ళాలి కదా అని అంటుంది. దాంతో కావ్య భోజనం ఆపేసి స్వప్న తో వెళ్తుంది. మరొకవైపు రాజ్ డల్ గా ఉండటంతో ఇందిరాదేవి వచ్చి రాజ్ తో మాట్లాడుతుంది.
కళ్యాణ్ అక్కడ ఇబ్బంది పడుతుంటే చూడలేకపోతున్నాను.. డబ్బులు ఇస్తే వద్దని అంటున్నాడని రాజ్ చెప్తాడు. ఈ ఇంట్లో పెళ్లి అయిన వాళ్లతో వరలక్ష్మి వ్రతం చేయడం ఆనవాయితి కాబట్టి స్వప్న, కావ్యలతో పాటు అప్పుతో కూడా చేయించాలి. అందుకే రేపు వాళ్లకు రమ్మని చెప్పాలని ఇందిరాదేవి అనగానే.. రాజ్ సరే అంటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. కాసేపటికి నేను చాలా హ్యాపీగా ఉన్నానని కావ్యతో రాజ్ అంటాడు. మరుసటి రోజు ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం కాబట్టి అప్పు కళ్యాణ్ లని కూడా పిలవాలని ఇందిరదేవి అంటుంది. తరువాయి భాగంలో ఇందిరాదేవి, సీతారామయ్యలు అప్పు, కళ్యాణ్ ల దగ్గరకి వెళ్లి పూజకి రమ్మని పిలుస్తారు. ఆ తర్వాత అప్పు ఈ ఇంటికి కరెక్ట్ కొడలు కాదని నిరూపిస్తానని రుద్రాణితో ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.