English | Telugu

ఈ వారం డేంజర్ జోన్ లో ఉంది ఆ ముగ్గురే!

బిగ్ బాస్ సీజన్-8 ఎనిమిదో వారానికి వచ్చేసింది. ఇప్పటికే హౌస్ నుండి ఏడుగురు ఎలిమినేట్ అయి బయటకు వచ్చారు. గత వారం వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ బయటకికి వచ్చాడు. ఈ వారం ఎవరు బయటకు వస్తారనేది అందరిలో ఉన్న క్యూరియాసిటీ.

ప్రస్తుతం నామినేషన్ లో టేస్టీ తేజ, హరితేజ, గౌతమ్, యష్మీ, నయని పావని ఉన్నారు. వీరిలో టాప్ లో యష్మీ, రెండవ స్థానంలో గౌతమ్ ఉన్నారు. ఆ తర్వాత వరుసగా టేస్టీ తేజ, హరితేజ, నయని పావని లు ఉన్నారు. చివరి రెండు స్థానాలలో నయని పావని, హరితేజ ఉన్నారు. ఈ ఇద్దరు కూడా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కాగా నయని పావని గత సీజన్ లో ఒక్క వారం ఉండే బయటకు వచ్చింది. అనుకోకుండా మళ్ళీ ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది కానీ ఇప్పటివరకు కూడా పర్ఫా మెన్స్ బాగుందని కాంప్లిమెంట్ నాగార్జున నుండి అయితే రాలేదు. ఎప్పుడు హౌస్ లో వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు. వీళ్ళు ఛాన్స్ ఇవ్వలేదని ఇతరులపై ఆధారపడుతుంది కానీ సొంతంగా గేమ్ లో ముందుకి వెళ్లాలని ట్రై చెయ్యలేదు. గత వారం నామినేషన్ లో లేకపోవడం వల్ల సేవ్ అయింది కానీ ఈ వారం నయని బయటకు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది.

హరితేజ మాజీ కంటెస్టెంటే.. తను ఎంట్రీ ఇచ్చిన సీజన్ లో హరితేజ మంచి పర్ఫామెన్స్ ఇచ్చింది కానీ ఇప్పుడు ఆ పర్ఫామెన్స్ ని క్రాస్ చెయ్యలేకపోతుంది. అదే విషయం దీపావళి ఎపిసోడ్ లో వచ్చిన గెస్ట్ హైపర్ అది కూడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఓటింగ్ లో టేస్టీ తేజ, హరితేజ, నయని పావని ఉన్నారు. వీళ్లు ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నట్టే.. వీరిలో ఒకరు మాత్రం ఖచ్చితంగా బయటకు వచ్చేస్తారు. అయితే నయని పావనికి ఓటింగ్ చాలా తక్కువగా ఉండటంతో తనే ఈ వారం ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.