English | Telugu

బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్ట్ కార్డ్ ఎంట్రీ...ముగ్గురి లో ఎవరు?


బిగ్ బాస్ సీజన్ 8 మొదలై ఇప్పటికే మూడు వారాలు అవుతోంది. ‌కానీ హౌస్ లో సరైన ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చేవాళ్ళు లేకపోవడంతో ఇది అంతగా ఇంట్రెస్టింగ్ గా లేదని బిబి టీమ్ వైల్ట్ కార్డ్ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి వారిలో ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఈసారి హౌస్‌లోకి కొత్త కంటెస్టెంట్లతో పాట గత ఏడు సీజన్లలో ఆల్‌రెడీ హౌస్‌లోకి అడుగుపెట్టిన కొంతమంది కంటెస్టెంట్లు కూడా ఉండబోతున్నారంట. ఇందులో ముగ్గురు ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యారు. అందులో మొదటగా జబర్దస్త్ రోహిణి అని తెలుస్తోంది. గతంలో బిగ్‌బాస్ సీజన్ 3 లో రోహిణి మెరిసింది. టాస్కుల విషయం పక్కన పెడితే హౌస్‌లో కామెడీ మాత్రం గట్టిగానే చేసింది. అందులో ఈసారి సీజన్‌లో పెద్దగా కామెడీ చేసే కంటెస్టెంట్లు ఎవరూ లేకపోవడంతో రోహిణిని లోపలికి తీసుకొచ్చే ప్రయత్నంలో బిబి టీమ్ ఉందని తెలుస్తోంది.

మరొకరు అవినాష్ అని తెలుస్తోంది. బిగ్‌బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ ముక్కు అవినాష్ కూడా మరోసారి హౌస్‌లోకి రాబోతున్నాడని వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవినాష్‌ను పంపేందుకు ఇప్పటికే బిగ్‌బాస్ టీమ్ ఫిక్స్ అయిపోయిందట. అవినాష్ కూడా తన కామెడీతో బాగానే లాక్కొస్తాడు. ఇక బిగ్‌బాస్ సీజన్ 1 లో దుమ్ముదులిపిన హరితేజను కూడా ఈసారి వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి తీసుకొస్తున్నారంట. ఇక వీరితో పాటు రీతు చౌదరి ఫ్రెండ్ గోరింటాక్ సీరియల్ ఫేమ్ కావ్య కూడా హౌస్ లోకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మీరెవరు వస్తారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.