English | Telugu

ఈ సారి అయినా బిగ్ బాస్ విన్నర్ లేడీ కంటెస్టెంట్ అయ్యేనా!

బిగ్ బాస్ తెలుగు ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకొని ఎనిమిదో సీజన్లో అడుగుపెట్టింది. అయితే ఒక్క సీజన్ లో కూడా ట్రోఫి అనేది లేడి కంటెస్టెంట్ ని వరించలేదు. మొదటి సీజన్ నుండి అన్ని ట్రోఫీలు అబ్బాయిలే గెలుచుకున్నారు. అందరు కూడా నాగార్జునతో హౌస్ లోకి వచ్చేముందు.. ఇప్పటివరకు లేడీ బిగ్ బాస్ అవ్వలేదు. నేను అవ్వాలని వచ్చానంటూ హౌస్ లోకి వచ్చిన మహిళలు చెప్తుంటారు కానీ అది ఎప్పటికి తీరని కోరికలాగే ఉంటూ వస్తుంది.

ఇప్పటివరకు జరిగిన అన్నింటిలో శివ బాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్, వీజే సన్నీ, సింగర్ రేవంత్, పల్లవి ప్రశాంత్ ఇలా అందరు అబ్బాయిలే బిగ్ బాస్ ట్రోఫీని గెలుచుకున్నారు. సీజన్ లో గెలుపుకి ఒక్క అడుగు దూరంలో శ్రీముఖి వచ్చి ఆగిపోయింది. రాహుల్ సిప్లిగంజ్ విన్నర్.. శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది. అయితే ఈ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని భావించిన కిర్రాక్ సీత అనూహ్యంగా బయటకు వచ్చేసింది. ఇక ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఉమెన్ కంటెస్టెంట్స్ లలో ప్రేరణ‌‌ స్ట్రాంగ్ గా ఉంది. అబ్బాయిలతో ఈక్వల్ గా ఆడుతూ వారికి గట్టి పోటీ ఇస్తుంది. సెకెండ్ యష్మీ.. ఆటపరంగా అయితే ప్రేరణ, యష్మీ స్ట్రాంగ్ ఉండగా.. బయట ఫాలోయింగ్ పరంగా చూస్తే విష్ణుప్రియ టాప్ లో ఉంది. రోహిణి ఎంటర్‌టైన్మెంట్ పరంగా టాప్ లో ఉంది. ఇక భారీ అంచనాలతో వచ్చిన హరితేజ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతుంది. నయని గురించి ప్రత్యేకంగా చెప్పన్నక్కర్లేదు ఈ వారం వోటింగ్ లో లీస్ట్ వుంది.

ఇకపోతే గంగవ్వ విషయానికి వస్తే నామినేషన్ లో లేకపోవడం వల్లే ఇప్పటికి హౌస్ లో కొనసాగుతుంది. టాప్- 5 లో మాత్రం ప్రేరణ, యష్మీ ఇద్దరు ఉంటారని తెలుస్తోంది. ది వరెస్ట్ కంటెస్టెంట్ గా విష్ణుప్రియ ఉండగా.. గౌతమ్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. నబీల్ గేమ్ కాస్త డల్ అయ్యిందనేది తెలుస్తోంది.


Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.