English | Telugu

Bigg Boss 9 Telugu : దివ్య కెప్టెన్సీ కంటెండర్స్.. రీతూ ఒక్కటే గెలిచింది!

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ కోసం నువ్వా నేనా అన్నట్టుగా కంటెస్టెంట్స్ పోటీపడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా కెప్టెన్సీ టాస్క్ కోసం సీక్రెట్ టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్. దివ్య, సుమన్ శెట్టి ఇద్దరిని రెబల్స్ చెయ్యగా వాళ్ళకి రెండు సీక్రెట్ టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్. అయితే వాళ్ళిద్దరూ సక్సెస్ ఫుల్ గా టాస్క్ ఫినిష్ చేస్తారు. ఫస్ట్ సీక్రెట్ టాస్క్ ఫినిష్ చేసి రెబల్ గా కళ్యాణ్ ని అట లో నుండి తొలగించారు.

ఇక ఆ తర్వాత రెబల్ గా బిగ్ బాస్ రీతూకి చెప్తాడు. తనకి రెండు సీక్రెట్ టాస్క్ లు ఇస్తాడు. ఒకటి ఎవరితో అయినా పెద్ద గొడవ పెట్టుకోవాలి. రెండోది ఇమ్మాన్యుయల్ ఫ్యామిలీ ఫోటోని కొట్టేయ్యాలి. అందులో ఒక టాస్క్ గెలిచి శ్రీనివాస్ సాయిని అట నుండి తొలగిస్తుంది. రెండో టాస్క్ ఫెయిల్ అవుతుంది. హౌస్ లో ఒకరికొకరు నువ్వే రెబల్ ఆ అంటూ ఒకరికొకరు అడుగుతారు కానీ ఎవరు బయటపడరు.

బిగ్ బాస్ మూడు టీమ్ లకి ఒక టాస్క్ ఇస్తాడు. అందులో ఆరేంజ్ టీమ్ విన్ అవుతుంది. వాళ్ళలో ఎవరికీ గ్రీన్ బ్యాడ్జ్ ఉంటుందో వాళ్ళలో ఒకరికి రెబల్ తొలగించే టాస్క్ నుండి తొలగించే ప్రక్రియ నుండి రిలీఫ్ అవుతారు. ప్రస్తుతం ఆ బ్యాడ్జ్ తనూజ దగ్గర ఉంటుంది. ఇమ్మాన్యుయల్, గౌరవ్ నాకు కావాలంటే నాకు కావాలని ఇద్దరు గొడవ పెట్టుకుంటారు కానీ రాము ఇలాంటి రియాక్ట్ లేకుండా డైరెక్ట్ నాకు వద్దని చెప్తాడు. దాంతో బ్యాడ్జ్ ని గౌరవ్ కి ఇస్తారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.