English | Telugu
Jayam serial : గంగకి బాక్సింగ్ కోచ్ గా రుద్ర.. శకుంతల డ్రామా!
Updated : Nov 7, 2025
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -105 లో.....గంగ తన కాలికి పెన్ తో పట్టీల డిజైన్ వేసుకొని మురిసిపోతుంది. పాపం రుద్ర సర్ తనకి గిఫ్ట్ రిటర్న్ ఇచ్చినందుకు ఫీల్ అయిండెమో అని గంగ అనుకుటుంది. మరొకవైపు పారుని ఇషిక, వీరు కలుస్తారు. రుద్ర పెళ్లికి ఒప్పుకున్నాడు కానీ నీతో అని తెలియదని ఇషిక చెప్తుంది.
మరుసటి రోజు ఉదయం శకుంతల త్వరగా లేచి పూజ చేస్తుంది. రుద్ర వెళ్తుంటే అగు నాన్న అని కూర్చొపెట్టి నీకోసమే పూజ చేసాను అకాడమీ సక్సెస్ అవుతుంది. ఈ రక్ష కట్టుకోమని కడుతుంది. పాయసం తినిపిస్తుంది. ఇంకా మధ్యాహ్నం కి భోజనం కూడా పంపిస్తుంది. అదంతా చూసి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. పెద్దసారు మాత్రం ఇదంతా నీ నటన ఏమోనని భయంగా ఉంది శకుంతల అని అనుకుంటాడు. రుద్ర అకాడమీకి వెళ్తుంటే శకుంతల ఎదురువస్తుంది. ఆ తర్వాత మన ప్లాన్ సక్సెస్ అని ఇషిక, వీరు అనుకుంటారు. మరొకవైపు రుద్ర అకాడమీ వెళ్తాడు. అక్కడ ప్రాక్టీస్ కి దీప్తి రాదు.. ఎందుకు రాలేదో కనుక్కోమని రుద్ర కోచ్ కి చెప్తాడు. అప్పుడే పారు వచ్చి ఇక దీప్తి ఇక్కడికి ఎప్పటికి రాదు.. రాకుండా చేసానని చెప్తుంది.
ఇప్పుడు నువ్వు సెలక్షన్ కి ఎవరిని పంపిస్తావ్.. అసలు స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరున్నారని పారు అంటుంది. నేనున్నానని గంగ ఎంట్రీ ఇస్తుంది. నువ్వా అంటూ పారు వెటకారంగా నవ్వుతుంది. దాంతో గంగ ఫోర్స్ గా తన మొహంపై పంచ్ ఇవ్వబోతు ఆగుతుంది. దాంతో పారు భయపడుతుంది. నాకు ట్రైనింగ్ ఇవ్వండి రుద్ర సర్ మీ నమ్మకం నిలబెడతానని రుద్రతో గంగ అంటుంది. తరువాయి భాగంలో శకుంతల చూసిన అమ్మాయి పారు అని రుద్రతో పాటు ఇంట్లో అందరికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.