English | Telugu

అరియానాకు సిరి అడ్డంగా దొరికిందిగా

బిగ్‌బాస్ సీజ‌న్ 5 ముగిసింది. అయినా ఇంకా వార్త‌ల్లో నానుతూనే వుంది. కార‌ణం ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్ లు వ్య‌వ‌హ‌రించిన తీరే. హౌస్‌లో సిరి, షన్నుల మ‌ధ్య జ‌రిగిన ట్రాక్ ఇప్ప‌టికీ హాట్ టాపిక్ గానే కొన‌సాగుతోంది. దీనిపై బిబి4 సీజ‌న్ కంటెస్టెంట్, బిగ్‌బాస్ బ‌జ్ హోస్ట్ అరియానా గ్లోరి త‌న‌దైన స్టైల్లో స్పందించింది. సిరితో ప్ర‌త్యేకంగా మాట్లాడిన అరియానా ఓ విధంగా చెప్పాలంటే సిరిని చెడుగుడు ఆడేసుకుంద‌ని చెప్పొచ్చు.

హౌస్‌లో సిరి, ష‌న్ను స‌మ‌యం చిక్కితే చాలు ఫ్రెండ్షిప్ హ‌గ్ అంటూ వ‌రుస హ‌గ్గుల‌తో ర‌చ్చ ర‌చ్చ చేసిన విష‌యం తెలిసిందే. దీంతో వీరిపై నెటిటివిటీ మొద‌లైంది. అంత వ‌ర‌కు స‌పోర్ట్ గా నిలిచిన ప్రేక్ష‌కులు ఒక్క‌సారిగా స‌న్నీ వైపు తిరిగి అత‌న్ని స‌పోర్ట్ చేయ‌డం మొద‌లుపెట్టారు. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ సిరిని ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేసింది అరియానా. హౌస్ లో స‌న్నీని టార్గెట్ చేశావా? అని అరియానా అడిగితే లేదు అని చెప్పింది సిరి. టాస్కుల్లో గొడ‌వ‌లు జ‌రుగుతుండ‌టంతో అత‌నితో ఫ్రెండ్షిప్ చేసే అవ‌కాశం ఎలా వుంటుంద‌ని సిరి చెప్ప‌డంతో మ‌రి ష‌న్నుతో కూడా జ‌రిగింది అంత‌కు మించి క‌దా అని పంచ్ ఏసింది.

Also read:సిరి, ష‌న్ను రిలేష‌న్ పై స‌న్నీ కామెంట్

ర‌విని నామినేట్ చేశారు. అత‌ను వెళ్లిపోగానే అత‌ని కోస‌మే గేమ్ ఆడుతున్నామ‌ని అని చెప్ప‌డం ఏంటీ? అని అడిగింది అరియానా.. దీంతో సిరికి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోయింది. ఇక ఫైన‌ల్ గా చోటు కావాలా? ష‌న్ను కావాలా అంటే ఇద్ద‌రిలో ఎవ‌రిని ఎంచుకుంటావ‌ని సిరికి దిమ్మ‌దిరిగే పంచ్ వేసింది అరియానా. అయితే అరియానా ఊహించిన‌ట్టే ఆ ప్ర‌శ్న‌కు ఏం స‌మాధానం చెప్పాలో తేల్చుకోలేక మౌనంగానే చూస్తుండి పోయింది సిరి. తాజా ఎపిసోడ్ కి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.